India reaches 74,281 Covid-19 cases దేశంలో 74 వేలు దాటిన కరోనా కేసులు.. 2415 మరణాలు

Coronavirus update covid 19 cases in india reaches 74 281

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India witnessed its biggest jump in Coronavirus-linked cases today, with 3525 people testing positive for COVID-19 in the last 24 hours, government data showed. Positive cases tally reaches to 74,281 people have tested positive for coronavirus and 2415 have died due to the virus.

దేశవ్యాప్తంగా 74 వేలు దాటిన కరోనా కేసులు.. 2415 మరణాలు

Posted: 05/13/2020 10:23 AM IST
Coronavirus update covid 19 cases in india reaches 74 281

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. పలు సడలింపులతో మూడవ విడత లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతీరోజు మూడువేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి, ఈ నేపథ్యంలో దేశంలో నాలుగో విడత లాక్ డౌన్ కూడా కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. అయితే అది కొత్త రూపంలో వుంటుందని, ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని కూడా సూచించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 3525 సాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74 వేల మార్కును దాటింది. ప్రతీరోజు మూడు వేల కేసులు నమోదు అవుతుండటం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది.

ఎలాంటి సడలింపులు లేకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేసిన సందర్భంగా రెండో విడత వరకు రోజుకు వెయి మందికి అటుఇటుగా నమోదైన కేసుల సంఖ్య సడలింపులతో కూడా మూడో విడత లాక్ డౌన్ అమల్లోకి రాగానే కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మూడు వేల 525 పాజిటివ్ కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం 74 వేల 281 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2415కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 122 మరణాలు సంభవించాయి.

దీంతో వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 24,386 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 47,480 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కాగా, వలస కార్మికుల వల్లే ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని అక్కడి వైద్యాధికారులు కేంద్రానికి తెలిపినట్లు సమాచారం. కరోనా ప్రభావం అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ ల్లోనే నమోదు కావడం గమనార్హం.

మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఏకంగా 24 వేల మార్కును దాటాయి.  నిన్న ఒక్కరోజే 1026 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఏకంగా 53 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24,427 కేసులు నమోదు కాగా, మొత్తంగా 921 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. గుజరాత్ నుంచి స్వస్థలాలకు వెళ్లున్న కార్మికుల్లో కరోనా బయటపడటంతో అందోళన కలుగిస్తోంది. ఇక గుజరాత్ లోనూ ఇప్పటి వరకు మొత్తం 8903 కేసులు నమోదు కాగా, 513 మంది కరోనాబారిన పడి మరణించారు.

మహారాష్ట్ర, గుజారాత్ రాష్ట్రాల తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కరోనా విలయతాండవం చేస్తోంది. అటు మధ్యప్రదేశ్ లోనూ కోవిడ్ ప్రభావం అధికంగా కొనసాగుతోంది.  రాష్ట్రం మొత్తం 3966 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 225 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ వైరస్ తన ప్రభావాన్ని చాటుతుంది. ఇటు తమిళనాడులోనూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 798 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 8వేల మార్కు దాటింది. మొత్తంగా 8718 మందికి కరోనా 61 మంది మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles