కరోనా మహమ్మారిపై సుదీర్ఘ యుద్ధం తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మహమ్మారిపై పోరులో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా కల్పించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. కరోనాపై యుద్దం చేస్తూనే.. అభివృద్ధి వైపు కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాని జాతికి పిలుపునిచ్చారు. ఈ బాధ్యతను 130 కోట్ల మంది తలకెత్తుకోవాలని సూచించారు. కరోనాపై పోరాటంలో భాగంగా నాల్గవ విడత లాక్ డౌన్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ లాక్ డౌన్ కొత్త రూపంలో ఉండనుందని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్-4లో కూడా అన్ని నియమాలు, జాగ్రత్తలు పాటిద్దామని తెలిపారు.
నాలుగో విడత లాక్ డౌన్ అంశాలను ఈనెల 18 లోపు ప్రకటిస్తామని ప్రధాని వెల్లడించారు. ఇక, కరోనా సంక్షోభంలో దేశీయ ఉత్పత్తిదారులే ఆధారమయ్యారని, డిమాండ్లకు తగిన విధంగా సరఫరాతో జాతి అవసరాలు తీర్చారని కొనియాడారు. భారత్ లో ఇకపై స్థానిక వస్తు వినియోగం పెరగాలని, మనవాళ్ల నుంచే వస్తువులు కొనుగోలు చేయాలని మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా ప్రాశస్త్యాన్ని మరోసారి నొక్కిచెప్పారు. భారతీయ ఉత్పత్తుల వినియోగం పెరగడం వల్ల భవిష్యత్తులో కరోనా తరహా ఎలాంటి విప్తతులు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోనవచ్చునని అన్నారు. ఈ నేపథ్యంలో ఖాదీ వస్త్రాల ప్రస్తావనను ప్రధాని ప్రస్తావించారు. ప్రజలందరూ ఖాదీ ఉత్పత్తులను వినియోగాన్ని పెంచాలన్నారు. స్థానిక వస్తువులకు ప్రజలే ప్రచారకర్తలుగా వ్యవహరించాలన్నారు.
గత 4 నెలులుగా కరోనాతో పోరాడుతున్నామని, యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా శక్తివంచన లేకుండా శ్రమిస్తోందని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దం భారత్ దేనని, దేశం మున్ముందు కూడా మరింత మెరుగైన ఆర్థిక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక తాజాగా ప్రకటించిన ప్యాకేజీ మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, కార్మికులు, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలపై వెచ్చించనున్నామని, పేదలు, వలస కార్మికులు, కూలీలు, మత్స్యకారులకు ఈ ప్యాకేజి ఊతమిస్తుందని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వెల్లడిస్తారని మోదీ పేర్కొన్నారు. విపత్తును కూడా భారత్ అవకాశంగా మల్చుకుంటుందని తెలిపారు.
ఇప్పుడు భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందని వివరించారు. ఈ తరుణంలో దేశ ప్రజలు ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ కరోనాను కూడా దీటుగా ఎదుర్కొంటోందని తెలిపారు. సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదని అన్నారు. ఈ విపత్కర సమయంలో భారత్ సామర్థ్యాన్ని ప్రపంచదేశాలు నమ్ముతోందని, భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయని తెలిపారు. ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా ఇచ్చిందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Feb 25 | కరోనా మహమ్మారి మానవాళిపై సృష్టించిన కష్టకాలాన్ని పక్కనబెడితే.. దాని పేరుతో ఇప్పుడు దేశంలో ధరఘాతం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఇంధన ధరలు సెంచరీ మార్కుకు చేరుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే... Read more
Feb 25 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లోని ప్రజల ధనంతో ఆర్థిక నేరానికి పాల్పడి.. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూనైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ కోర్టు షాకిచ్చింది. గత రెండున్నరేళ్లుగా... Read more
Feb 25 | కార్మికుల సమస్యల పరిష్కారించేందుకు, వారి సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగాల్పిన కార్మిక నేత దారి తప్పాడు. కార్మిక నేత హోదాలో తోటి కార్మికుడికి తానే సమస్యగా మారాడు. తన కాలనీలోనే నివాసం ఉంటున్న మరో... Read more
Feb 25 | అమ్మాయిల కాలేజీకి వద్ద కోతుల బ్యాచ్ తిష్ట వేసింది. ఉదయం, సాయంకాలలతో పాటు రాత్రి వేళ్లలోనూ అక్కడే అవాసాన్ని ఏర్పాటు చేసుకుని కాలేజీ విద్యార్థినులతో పాటు ఉపాద్యాయులను కూడా వేధిస్తున్నాయి. ఈ కోతుల బ్యాచ్... Read more
Feb 25 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఎన్నికలను జరగనున్న కేరళ రాష్ట్రంలో పర్యటిస్తూ.. అక్కడి కొల్లాం జిల్లాలోని మత్య్సకారుల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలసి సముద్రయానం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సముద్రంలో... Read more