దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతీరోజు మూడువేల మందికి పైగా కరోనావైరస్ బారిన పడుతున్నారు, దేశంలో ఎలాంటి సడలింపులు లేకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేసిన సందర్భంగా రెండో విడత వరకు రోజుకు వెయి మందికి అటుఇటుగా నమోదైన కేసుల సంఖ్య మూడో విడత లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రోజుకు మూడు వేల కేసులకు పైబడే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో అత్యధిక సంఖ్యలో వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి వ్యాప్తి కూడా రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. కాగా ఇవాళ తాజాగా నమోదూన సంఖ్య కూడా గరిష్ట స్థాయినే అందుకుంది.
గడిచిన 24 గంటల వ్యవధిలో 3320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు ఒక్కరోజులో బయటపడటం ఇది నాల్గవసారి. రెండు రోజుల క్రితం అత్యధికంగా 3900 సంఖ్య నమోదైన తరువాత అస్థాయిలో క్రితం రోజున మూడు వేల ఐదు వందల సంఖ్యలో ప్రభావితం చేసిన కరోనా క్రితం రోజున 3390 కేసులతో తృతీయ స్థాయిని అందుకోగా, ఇవాళ తాజాగా నాల్గవ గరిష్టస్థాయిలో దేశప్రజలను ప్రభావితం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేల మార్కును చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 59 వేల 662 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 95 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1981కు చేరింది.
దీంతో వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 17,847 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 39,834 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఏకంగా 19 వేల మార్కును దాటాయి. ేకంగా 731 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more