మానవాళి ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తూ పెను సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి నెలలు గడుస్తున్న కొద్దీ తన ఉధృతిని పెంచుకుంటూ తన రూపాన్ని మార్చకుంటూ.. లక్ష్యణాలను పెంచుకుంటూ ముప్పులా తయారవుతుంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై జరుగుతున్న అధ్యయనాలు మరో విషయాన్ని కూడా చెబుతున్నాయి. కరోనా పుట్టిన చైనాలోని వూహాన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అథ్యయానాల్లో మరో విషయం బయటపడింది. కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తోన్న ఆసుపత్రుల పరిసరాల్లోని గాలిలోనూ కరోనా జన్యు అవశేషాలు ఉన్నట్లు తేల్చారు.
దీంతో గాలీ ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..? అందుకనే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారా.? మానవజాతి మనుగడకే సవాల్ విసిరేలా లక్షలాది మంది మరణిస్తున్నారా.? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే, గాలిలోని కొవిడ్-19 ఆర్ఎన్ఏ వల్ల ఇతరులకి ఇన్ఫెక్షన్ సోకిన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని చెప్పారు. చైనాలో కరోనా విజృంభించి తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వూహాన్లో రెండు కరోనా ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో పరిశోధకులు అధ్యయనం చేయగా ఈ కొత్త విషయాలు వెల్లడయ్యాయి. నేచర్ రీసెర్చ్ జర్నల్లో పరిశోధకులు ఈ విషయాలను తెలిపారు.
తమ అధ్యయనంలో భాగంగా ఆ రెండు ఆసుపత్రుల చుట్టూ గాలిలోని నీటి తుంపరలను గుర్తించే ఎలక్ట్రిక్ ఏరోజల్ డిటెక్టర్లను పరిశోధకులు అమర్చారు. ఆయా ఆసుపత్రుల్లో కొవిడ్-19 రోగులు వాడే శౌచాలయాలకు తగిన వెంటిలేషన్ లేకపోవడంతో అవి వైరస్తో కూడిన తుంపరలకు ఆవాసాలుగా మారాయని వూహాన్ పరిశోధకులు తమ అధ్యయన నివేదికలో తెలిపారు. దీంతో అక్కడి నుంచే ఈ తుంపరలను వాహకంగా వాడుకొన్న వైరస్ ఆర్ఎన్ఏ ఆ ఆసుపత్రుల పరిసరాల్లోలోకి ప్రవేశించిందని చెప్పారు.
అంతేకాదు, కరోనా రోగులకు చికిత్స చేసిన తర్వాత ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక గదుల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ)లను విప్పేసే సమయంలో గాల్లోకి కరోనా వైరస్తో కూడిన తుంపరలు బయటకు వచ్చినట్లు తెలిపారు. అయితే, ఈ పరిస్థితిని సమర్థవంతమైన శానిటైజేషన్తో అరికట్టవచ్చని తెలిపారు. కరోనా రోగులు వాడే శౌచాలయాలకు వెంటిలేషన్ ఉండేలా చూడాలని సూచించారు. వైరస్ ప్రభావిత హాట్ స్పాట్లలోనూ ఇలాంటి జాగ్రత్త చర్యలు అత్యవసరమని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more