కరోనావైరస్ కష్టకాలంలో ఉద్యోగులకు తీపికబురు అందించింది ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ. లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఐటీ కంపెనీలు ఇప్పటికే పలు చోట్ల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు,జీతాల చెల్లింపులో కోతలు విధిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో క్యాప్ జెమీనీ చేసిన పని అందరినీ ఆశ్చర్యపర్చింది. భారతదేశంలోని క్యాప్ జెమినీ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 70 శాతం సిబ్బంది(84వేల మంది)కి ఏప్రిల్ 1,2020నుంచి నుంచి జీతభత్యాలు పెంచాలని నిర్ణయించారు.
మిగిలిన ఉద్యోగులకు కూడా జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని క్యాప్ జెమినీ ఇండియా యాజమాన్యం నిర్ణయించింది. జీతాలు పెంచడం తో క్యాప్ జెమినీ ఉద్యోగుల్లో సంతోషానికి అవధుల్లేవు. అంతే కాకుండా ప్రస్తుత లాక్డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు రూ.10,000 క్యాష్ అలవెన్స్ కూడా ప్రకటించింది క్యాప్ జెమినీ. మార్చి రెండో వారంలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి, విషయం బయటకు తెలిసే సరికి కాస్త ఆలస్యం అయింది. కేవలం ప్రాజెక్టుల్లో పనిచేసే వారికి మాత్రమే కాకుండా బెంచ్ ఉద్యోగులకు కూడా ఈ కంపెనీ జీతాలను అందిస్తుంది.
ప్రాజెక్టులు లేని బెంచ్ మీద ఉన్న ఉద్యోగులను నిలుపుకునేందుకు వీలుగా వారికి కూడా జీతాలు చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. బెంచ్ టైమ్ తో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని క్యాప్ జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డీ వివరించారు. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు షిఫ్ట్ అలవెన్సును ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. మొత్తం ఉద్యోగులలో 95% మందికి ఇది వర్తిస్తుంది. దీంతోపాటు ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రమోషన్లు జులై 1 నుంచి అమలు చేస్తామని కంపెనీ సీఈఓ ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more