కరోనా వైరస్ ఏమో గాని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి చూపిస్తుంది సోషల్ మీడియా. పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా క్యాబేజీ తింటే కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా చేసారు. క్యాబేజీ ఆకులపై కరోనా వైరస్ గంటల తరబడి బ్రతుకుతుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని ప్రపంచ అరోగ్య సంస్థ వెల్లడించినట్ుట కలరింగ్ కూడా అద్దుతున్నారు. దీంతో క్యాబేజీ రైతులు లబోదిబోమంటున్నారు.
దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఇందులో నిజం లేదని స్పష్టంగా చెప్పింది. ప్రెస్ ఏజెన్సీ బ్యూరో ఆఫ్ ఇండియన్ న్యూస్ (PIB) దీనిపై కథనం రాసింది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తల్ని నమ్మొద్దని ప్రజలకు స్పష్టంగా సూచనలు చేసింది. ప్రజలు అసలు ఆందోళన చెందవద్దు అని పేర్కొంది. క్యాబేజీలో మాత్రమే కరోనా గంటల పాటు ఉంటుందని వదంతులో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించింది. కరోనా నేపత్యంలో అన్ని కూరగాయలను వేడి నీళ్లలో కడిగి వాడాలని వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ సూచించింది.
మిగతా కూరగాయల మాదిరిగానే క్యాబేజీని కూడా వేడి నీటిలో కడగాలని సూచించిన డబ్యూహెచ్ఓ.. ఆ తర్వాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలని… ఆ తర్వాత క్యాబేజీని చిన్న ముక్కలుగా కోసుకొని, బాగా ఉడికించుకోవాలని సూచిస్తున్నారు. సగం ఉడికిన క్యాబేజీని తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల రైతులు ఇలాంటి తప్పుడు ప్రచారాల కారణంగా భారీగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు మరింత మంది రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
బేకరీ ఉత్పత్తుల వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందా?: బేకరీ ఉత్పత్తులపై కూడా తాజాగా మరో మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బేకరి ఉత్పత్తులను తింటే కరోనా వ్యాధి సంక్రమిస్తుందన్న మెసేజ్ కూడా వైరల్ అవుతోంది. ఇ:దుకు కారణం కూడా ఉంది. జంక్ ఫుడ్ ను కడిగేందుకు వీలుగా ఉండవనీ, వాటిపై కరోనా వైరస్ ఉంటుందనీ... అందువల్ల వాటిని తినవద్దని డబ్యూహెచ్ఓ చెప్పినట్లు మరో మెసేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి డబ్యూహెచ్ఓ అలా ఎక్కడా చెప్పలేదు. బేకరీ ఉత్పత్తుల వల్ల కరోనా వైరస్ ఈజీగా వ్యాపిస్తుందనేందుకు ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more