తెలంగాణలో కరోనా మహమ్మారి నియంత్రణలోకి వచ్చిందా.? అంటే ఔననే చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తరువాత అద్యథిక కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్యను కూడా పెంచుకూంటూ వెళ్లిన రాష్ట్రంలో మొత్తానికి తొలిసారి రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ గత వారం పది రోజులుగా తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే ఈ సంఖ్య తగ్గముఖం పడుతుందని చెప్పారు.
ఎట్టకేలకు కరోనా మహమ్మారిని తెలంగాణ ప్రభుత్వం కట్టడి చేయగలిగింది. సికింద్రాబాద్ లోని మహేంద్రహిల్స్ లో వుండే బాధితుడి నుంచి రాష్ట్రంలో నమోదైన తొలి కేసు నుంచి హజ్రాత్ నిజాముద్దీన్ ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో అంతకంతకూ పెరుగత తెలంగాణలో మహమ్మారి విలయతాండవం చేసింది. ఇప్పటికీ 18 మంది రాష్ట్రవాసులను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి.. తాజాగా ఇవాళ ఏ ఒక్కరిని తన కబంధ హస్తాలలోకి తీసుకోకపోవడం గమనార్హం. దీంతో తెలంగాణలో క్రితం రోజు ఉదయం నమోదైన మొత్తం 644 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరో ఆరుతో కలిపి క్రితం రోజు రాత్రి 650కి చేరింది.
కాగా, 650 మందిలో ఇప్పటి వరకు 110 మంది కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య ప్రస్తుతం 471గా వుంది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 18 మంది మహమ్మారి బారిన పడి అసువులు బాయగా, చికిత్స పొంది నయమైనవారి సంఖ్య కూడా తెలంగాణలో అధికంగానే వుంది. మొత్తంగా 110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాషట్రంలో నమోదైన మొత్తం 650 కరోనా కేసులలో అధికంగా తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదులోనే నమోదు కావడం గమనార్హం. నగరంలో ఏకంగా 213 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక జిల్లాల వారిగీ చూస్తే హైదరాబాద్ తరువాత నిజామాబాద్ లో 45 కేసులు, వరంగల్ లో 24 కేసులు, రంగారెడ్డిలో 23 కేసులు, గద్వాల్ లో 22 కేసులు, మేడ్చల్లో 18 కేసులు, కరీంనగర్ లో 18 కేసులు, నిర్మల్ లో 15 కేసులు, నల్గోండలో 14 కేసులు, అదిలాబాద్ లో 11 కేసులు, మహబూబ్ నగర్ లో 11 కేసులు, సూర్యపేటలో 10 కేసులు, కామారె్డిలో 10 కేసులు, సంగారెడ్డిలో 8 కేసులు, వికారాబాద్ లో ఐదు కేసులు, మెదక్ లో ఐదు కేసులు, భధ్రాద్రిలో 4 కేసులు, నగర్ కర్నూల్ లో 2, జనగాంలో 2, ఖమ్మంలో 2, పెద్దపల్లిలో 2, భూపాలపల్లిలో 2, సిద్దిపేటలో, మహబూబాద్ లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more