దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ బారిన అనేక మంది పడ్డారు. దేశంలోనూ వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ గత 24 గంటల్లో పలువుర్ని మందికి పైగా ప్రజలను తన బారిన పడేసింది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8713కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 295మంది మరణించగా 7573 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 845 మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. దేశంలో ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చేందుతున్న నేపథ్యంలో ఈ నెల 14వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే మారుతున్న పరిస్థితులకు అనుగూణంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు కూడా పొడగించాయి. అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారిని ఇప్పటికే దేశవ్యాప్తంగా 8713 మందిని కబళించి వేసింది. ఇక దీని బారిన పడి అసువులు బాసిన వారి సంఖ్య 295కు చేరింది. ఇక ఈ వ్యాధి బారిన పడి 845 మంది కొలుకుని బయటపడ్డారు.
ఇప్పటివరకు లక్ష 87 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్రం ప్రకటించింది. 151 పరీక్ష కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రుల సేవలను కూడా వినియోగించుకుంటున్నామని, కరోనా పరీక్షలు చేసేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక రాష్ట్రాల వారీగా కరోనా కేసులు, మృతుల వివరాలు చూస్తే.. తెలంగాణాలో 503 పాజిటివ్ కేసులు నమోదు కాగా 14 మరణాలు కూడా నమోదయ్యాయి. అటు ఏపీలో 407 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6 మరణాలు నమోదయ్యాయి.
ఇక దేశంలోనే అత్యధిక మంది మహారాష్ట్రలోనే ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇవాళ్టికి ఏకంగా 1895 కేసులు నమోదుకాగా, 129 మరణాలు కూడా నమోదయ్యాయి. ఢిల్లీలో 1069 కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. తమిళనాడులో 969 కేసులు, 11 మరణాలు, రాజస్థాన్ లో 796 కేసులు, 8 మరణాలు, మధ్యప్రదేశ్ లో 532 పాజిటివ్ కేసులు, 42 మరణాలు, గుజరాత్ లో 493 కేసులు, 23 మరణాలు, ఉత్తరప్రదేశ్ లో 452 కేసులు, ఐదు మరణాలు, కేరళలో 373 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి.
జమ్మూకశ్మీర్ లో 224 కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో 226 కేసులు, 6 మరణాలు నమోదుకాగా, హర్యానాలో 179 కేసులు, ఇద్దరి మృతి చెందారు. పంజాబ్ లో 158 కేసులు, 12 మంది మృతి చెందగా, పశ్చిమబెంగాల్ లో 132 కేసులు, ఐదుగురి మృతి చెందగా, బీహార్ లో 64 పాజిటివ్ కేసులు, ఒక మరణం సంభవించింది. ఇక అత్యల్పంగా ఒడిశాలో 54 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఒక మరణం సంభవించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more