Coronavirus cases in India reaches 8713, death toll at 295 దేశంలో 295కు చేరిన కరోనా మరణాలు.. 8713 పాజిటివ్ కేసులు

Coronavirus in india covid 19 cases in india cross 8700 mark death toll at 295

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The total number of coronavirus cases in India today jumped to 8713 after nearly 875 new infections were reported in past 24 hours, according to the latest data from Health Ministry. The death toll has gone up to 295 while 774 have recovered, showed the latest data.

దేశంలో 295కు చేరిన కరోనా మరణాలు.. 8713 పాజిటివ్ కేసులు

Posted: 04/13/2020 10:01 AM IST
Coronavirus in india covid 19 cases in india cross 8700 mark death toll at 295

దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ బారిన అనేక మంది పడ్డారు. దేశంలోనూ వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ గత 24 గంటల్లో పలువుర్ని మందికి పైగా ప్రజలను తన బారిన పడేసింది. దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8713కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 295మంది మరణించగా 7573 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 845 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. దేశంలో ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చేందుతున్న నేపథ్యంలో ఈ నెల 14వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే మారుతున్న పరిస్థితులకు అనుగూణంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు కూడా పొడగించాయి. అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారిని ఇప్పటికే దేశవ్యాప్తంగా 8713 మందిని కబళించి వేసింది. ఇక దీని బారిన పడి అసువులు బాసిన వారి సంఖ్య 295కు చేరింది. ఇక ఈ వ్యాధి బారిన పడి 845 మంది కొలుకుని బయటపడ్డారు.  

ఇప్పటివరకు లక్ష 87 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్రం ప్రకటించింది. 151 పరీక్ష కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రుల సేవలను కూడా వినియోగించుకుంటున్నామని, కరోనా పరీక్షలు చేసేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక రాష్ట్రాల వారీగా కరోనా కేసులు, మృతుల వివరాలు చూస్తే.. తెలంగాణాలో 503 పాజిటివ్ కేసులు నమోదు కాగా 14 మరణాలు కూడా నమోదయ్యాయి. అటు ఏపీలో 407 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6 మరణాలు నమోదయ్యాయి.

ఇక దేశంలోనే అత్యధిక మంది మహారాష్ట్రలోనే ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇవాళ్టికి ఏకంగా 1895 కేసులు నమోదుకాగా, 129 మరణాలు కూడా నమోదయ్యాయి. ఢిల్లీలో 1069 కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. తమిళనాడులో 969 కేసులు, 11 మరణాలు, రాజస్థాన్ లో 796 కేసులు, 8 మరణాలు, మధ్యప్రదేశ్ లో 532 పాజిటివ్ కేసులు, 42 మరణాలు, గుజరాత్ లో 493 కేసులు, 23 మరణాలు, ఉత్తరప్రదేశ్ లో 452 కేసులు, ఐదు మరణాలు, కేరళలో 373 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి.

జమ్మూకశ్మీర్ లో 224 కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో 226 కేసులు, 6 మరణాలు నమోదుకాగా, హర్యానాలో 179 కేసులు, ఇద్దరి మృతి చెందారు. పంజాబ్ లో 158 కేసులు, 12 మంది మృతి చెందగా, పశ్చిమబెంగాల్ లో 132 కేసులు, ఐదుగురి మృతి చెందగా, బీహార్ లో 64 పాజిటివ్ కేసులు, ఒక మరణం సంభవించింది. ఇక అత్యల్పంగా ఒడిశాలో 54 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఒక మరణం సంభవించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles