Coronavirus Cases Raise to 531 In Telangana తెలంగాణలో 531కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..

New coronavirus cases reported in telangana tally rises to 531

coronavirus,coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana,' Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

The total number of positive coronavirus cases reached 531 in Telangana on Thursday said the Health Department of the state.

తెలంగాణలో 531కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు,

Posted: 04/13/2020 11:10 AM IST
New coronavirus cases reported in telangana tally rises to 531

మృతుల సంఖ్య మొత్తంగా 16కు చేరింది. రాష్ట్రంలో అనేక మందిని తన ప్రభావానికి గురిచేస్తోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 531కి చేరింది. ప్రస్తుతం 410 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 16 మంది మృతి చెందగా.. మొత్తంగా  103 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రోజురోజుకు కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. తెలంగాణకు 95 శాతం కరోనా భయం తగ్గిందని.. ఇకపై కరోనా పాజిటివ్‌‌ కేసులు భారీగా నమోదు కాకపోవచ్చని మంత్రి ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేసినా., కరోనా కేసులు పెరుగుతూనే వుండటం కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు వరకు రాష్ట్రంలో 531కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని.. ప్రస్తుతం అందులో ఎవరికీ కూడా విషమంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 410 మందికి చికిత్స అందుతోందని..వీరిలో ఒక్కరు కూడా వెంటిలేటర్‌పై లేరని తెలిపారు.

నిజాముద్దీన్ ఘటన అనంతరం పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా మర్కజ్‌ సదస్సుతో సంబంధం ఉన్నవారే ఉన్నారు. నిన్న నిర్ధారణ అయిన 40 కేసులు మర్కజ్‌తో సంబంధం  ఉన్నవే. ఇవి మరిన్ని పెరిగే అవకాశముంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. మర్కజ్‌ నుంచి వచ్చిన  వారితో కలిసిమెలిసి తిరిగిన ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వారికి  పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చినవారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మర్కజ్‌ లింకు ఉన్నవారికి సంబంధించి మరో 535 మంది ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఈ సంఖ్య పెరుగుటకు కారణమైందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ లెక్కల ప్రకారం అత్యధికంగా హైదరాబాద్‌లోనే కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో రెండు మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 16కి పెరిగింది. ఇవాళ తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న ఏడుగురిని డిశ్చార్జి చేశారు. కాగా, రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని కోరడం తెలిసిందే. తొలి దశ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా, ఏప్రిల్ 30 వరకు అమలు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles