యవత్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వేలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ పంజా విసురుతోంది. ప్రస్తుతం వేగాన్ని అందుకున్న ఈ మహమ్మారి గంట గంటకు తన బారిన పడుతున్న వారి సంఖ్యను పెంచుకుంటూనే సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4067కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక దేశంలో మరణాల సంఖ్య కూడా వంద మార్కు దాటిపోయింది. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 291 మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారని తెలిపింది.
అయితే ఇంతటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ దేశంలో వందల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడటానికి కారణమం నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలేనని స్పష్టం అవుతోంది. ఇక్కడి తబ్లిగీ జమాత్ ప్రార్థనాల్లో పాల్గొనేందుక వచ్చిన విదేశీయులే కారణమా..? లేక ఇందులో కూడా ఏమైనా కుట్రలు దాగివున్నాయా.? అన్న విషయం తెలియాల్సి వుంది. ఇదిలావుండగా దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కొవిడ్-19 తీవ్రత కొనసాగుతోంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 19కు చేరగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 690గా ఉంది.
ఆ తరువాత అత్యధిక కేసులు నమోదైన తమిళనాడులో బాధితుల సంఖ్య 571కు చేరింది. ఆ పిమ్మట ఢిల్లీ 503, ఇక రాష్ట్రాల వారిగా చూస్తుంటే గణంకాలు ఇలా వున్నాయి. ఆంధ్రప్రదేశ్ 226, అండమాన్ నికోబార్ ఐలాండ్ 10, అరుణాచల్ ప్రదేశ్ 1, అసోం 26, బిహార్ 30, చంఢీగడ్ 18, చత్తీస్ గడ్ 9, గోవా 7, గుజరాత్ 122, హర్యానా 84, హిమాచల్ ప్రదేశ్ 13, జమ్మూకాశ్మీర్ 106, జార్ఖండ్ 3, కర్ణాటక 151, కేరళ 314, లడఖ్ 14, మధ్యప్రదేశ్ 165, మణిపూర్ 2, మిజోరం 1, ఒడిషా 21, పుదుచ్చేరి 5, పంజాబ్ 68, రాజస్తాన్ 253, తెలంగాణ 321, ఉత్తరాఖండ్ 26, ఉత్తర్ ప్రదేశ్ 227, వెస్ట్ బెంగాల్ 80 కేసులు నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more