ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నాలుగు వేలకు దాటిపోగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కేసులు 266కు చేరుకున్నాయి. మర్కజ్ సదస్సు కేసులు రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 60 కరోనా కేసులు నమోదవగా.. అందులో కర్నూలులో అత్యధికంగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6గంటల నుంచి 9గంటల వరకు జరిగిన పరీక్షల్లో కొత్తగా 14కేసులు నమోదు అయ్యాయి.
కొత్తగా నమోదైన కేసుల్లో విశాఖ నుంచి 5, అనంతపూర్ నుంచి 3 కర్నూల్ నుంచి 3 గుంటూరు నుంచి 2, పశ్చిమగోదావరిలో ఓ కేసు నమోదు అయ్యింది. తాజా నివేధికల ప్రకారం నెల్లూరు- 34, గుంటూరు- 32, కృష్ణా- 28, ప్రకాశం- 23, కడప- 23, చిత్తూరు-17, విశాఖ- 20, పశ్చిగోదావరి-16 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి- 11, అనంతపురం-6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలతో ఎవరు వచ్చినా చికిత్స అందించాలన్నారు. కరోనా నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ మర్కజ్కు వెళ్లొచ్చినవారిని గుర్తించి త్వరగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి ఆరోగ్య సర్వే నిరంతరం జరుగుతుండాలని ఆదేశించారు. కరోనా వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more