కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న వార్తలు వింటూనే ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. ఈ క్రమంలో దక్షిణాధి రాష్ట్రమైన తమిళనాడులో పెరుగుతున్న కరోనా కేసులు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో ఆకస్మికంగా గత రెండు రోజులుగా కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ విధించే ముందు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కజ్ బిల్డింగ్ లో జరిగిన మతపరమైన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
అయితే 22న జనతా కర్ప్యూ విధించిన ప్రధాని ఆ వెంటనే 23న మరోమారు ప్రజల ముందుకు వచ్చి కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో మార్చి 24 న లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. లాక్ డౌన్ ను ఎంతో కఠినంగా అమలుచేశారు. బయటకు వచ్చిన వారిపై పోలీసులు లాఠీలు కూడా జుళిపించారు. దీంతో సత్ఫాలితాలు వస్తున్నాయని ఆశిస్తున్న సమయంలో కొత్త కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు అలర్ట్ అయ్యాయి. ఈ కొత్త కేసులన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన కేసులు కావడంతో దీనిపై కేంద్రం సీరియస్ గా దృష్టి సారించింది.
తమిళనాడులో ఈ ఒక్కరోజులోనే 110 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో తూత్తుకుడి, తిరునెవేలి, శివగంగ, మధురై, కోయంబత్తూరు, తేని, దిండిగుల్ జిల్లాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ 110 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళే కావడంతో పళనిస్వామి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి వివరాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించి.. అందరినీ ఆస్పత్రులకు తరలిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధువులను కూడా క్వారంటైన్ సెంటర్లకు చేరుస్తున్నారు. వీరికి పరీక్షలను నిర్వహించిన తరువాతే.. 14 రోజుల పాటు క్వారంటైన్ లో వుంటామన్న పూచికత్తుపైనే ఇళ్లకు పంపిస్తామని చెబుతున్నారు.
తమిళనాడు నుంచి ఢిల్లీకి 1130 మంది వెళ్లగా, తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు 515 మందిని గుర్తించింది. మిగతా వారిని గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఈరోజు నమోదైన 110 కొత్త కేసులతో కలిపి తమిళనాడులో మొత్తం 234 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నమోదైన 43 కొత్త కేసులు కూడా ఢిల్లీ నుంచి వచ్చినవే. దేశరాజధానిలో కూడా కరోనా కేసుల సంఖ్య ఒక్కరోజులో గణనీయంగా పెరిగింది. బుధవారం(ఏప్రిల్-1,2020) ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 152కి చేరింది. గడిచిన 24గంట్లలోనే 32మందకి కరోనా వచ్చినట్లు నిర్థారణ అయింది. అయితే ఇందులో 53మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more