ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా భారత్లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం నాటికి 419 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అముల చేస్ున్న లాక్ డౌన్ కు ప్రజల నుంచి స్పందన కరువవుతుంది. దీంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ట్విటర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్ డౌన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధాని అన్నారు. విధిగా ఆరోగ్య సూచనలు పాటించాలని సూచించారు.
ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం పోంచివున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు నగరాల్లో ‘లాక్డౌన్ అమలు చేస్తే దానిని తేలిగ్గా తీసుకుని ప్రజలు నిర్లయం వహించడం సముచితం కాదని, వస్తున్న ఉపద్రవాన్ని తేలిగ్గా తీసుకోవడమే అవుతుందని ఆయన అబిప్రాపడ్డారు. ‘‘లాక్ డౌన్ పై నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకని ప్రకటించామో గుర్తించాలి. తీవ్రంగా పరిగణించి ప్రతి ఒక్కరూ విధిగా నియమాలు పాటించాలి. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని’ మోడీ ట్వీట్ చేశారు. మరోవైపు మహమ్మారి ప్రభావం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పరిశ్రమలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు లాక్డౌన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దేశవ్యాప్తంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్డౌన్ విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ మార్చి 31వరకు కొనసాగనుంది. అన్ని మెట్రో, రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలను మార్చి 31 వరకు నిలిపివేయగా, అత్యవసర సరుకులు, మందుల కొరత రాకుండా ఆయా ప్రభుత్వాలు సంబంధిత చర్యలను తీసుకుంటున్నాయి. పాల ఉత్పత్తులు, కిరాణా షాపులు, పెట్రోల్ పంపులు లాంటి అవసరమైన సేవలు మాత్రమే ప్రజల సౌలభ్యం కోసం తెరిచి ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more