ఆంద్రప్రదేశ్ లో కరోనా పరిస్థితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్.. దేవుడి దయంతో కరోనా వైరస్ తమ రాష్ట్రంలో విజృంభించడం లేదని, అధికారులు అన్ని విధాల చర్యటు లీసుకుని దానిని నియంత్రిస్తున్నారని అన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీ మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. దేశం మొత్తం మీద దాదాపు 415 కేసులు నమోదు అయితే.. దాదాపుగా 8 మంది వరకు వైరస్ బారినపడి చనిపోయారని చెప్పారు. తమ రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు కేవలం 6 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. అందులో ఒక కేసు నయమైందని, ఒకరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసినట్టు జగన్ చెప్పారు.
అయితే కరోనా వ్యాధి కట్టడికి మార్చి 31 వరకు ఏపీ లాక్ డౌన్ చేయనున్నట్టు రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నట్టు చెప్పారు. నిత్యావసర సర్వీసులు మాత్రం పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిమిత సంఖ్యలో రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారని తెలిపారు. దేశాల నుంచి వచ్చిన వాళ్లు 14 రోజుల పాటు హోం క్వారంటైన్ అవ్వాలని సూచించారు. ప్రజలందరికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మార్చి 31 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దన్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పోవాలని చెప్పారు.
ఈ నెల 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 4న ప్రతీ తెల్ల రేషన్ కార్డుదారుని ఇంటికి వెళ్లి గ్రామ వాలంటీర్ రూ.1000 అందిస్తారని జగన్ స్పష్టం చేశారు. 10 మందికి మించి ఎవరూ గుమిగూడవద్దని జగన్ సూచించారు. రైతులు, రైతు కూలీలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. నీళ్లు, కూరగాయలు, పాలు, ఎలక్ట్రిసిటీ, మెడికల్, గ్యాస్, పెట్రోల్ బంకులు, వాటర్ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 10 ఏళ్ల లోపు పిల్లలను తల్లిదండ్రులు బయటకు పంపొద్దన్నారు. 60 ఏళ్ల దాటిన వృద్ధులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని 3 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాలకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 75 జిల్లాల్లో కరోనా నిర్భంధం కొనసాగుతోంది. విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని కేంద్ర ఆదేశించింది. ఈ జిల్లాల నుంచే కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రత్యేకించి ఈ జిల్లాలోని వారిని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కర్ఫ్యూ విధించింది. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అన్ని రకాల ఆంక్షలను కేంద్రం అమలు చేస్తోంది. మంత్రిత్వ శాఖలవారీగా అందరిని సమన్వయపరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసే చర్యలను వేగవంతం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more