ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల పైచిలుకు మందిని తన కబంధహస్తాలలో చిక్కుకోగా ఏకంగా ఆరు వేల మంది ప్రాణాలను ఈ వైరస్ బలితీసుకుంది. ఇక ఈ కరోనా మహమ్మారి మన దేశవాసులను గజగజ వణికిస్తోంది. మన దేశంలోనే చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వాలు సెలవులు ఇచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో మార్చి 31వ తేదీ వరకు సెలవులు ఇచ్చాయి.
మరికొన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 2వ తేదీ వరకు విద్యా సంస్థలు మూసేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మాత్రం మరో అడుగు ముందుకేసీంది. విద్యా సంస్థలకు సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాయకుండానే పైతరగతులకు పంపాలని నిర్ణయించింది. అయితే ఈ వెసులుబాలు ప్రభుత్వ స్కూల్స్ లో చదివే 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే వర్తించనుంది. వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేస్తామని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ వెల్లడించింది. ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తామని స్పష్టం చేసింది.
యూపీలో ప్రైమరీ పాఠశాలలకు మార్చి 23 నుంచి 28 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేశారు. ఏప్రిల్ 2 వరకు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మరికొన్ని రోజులు కరోనా వైరస్ తీవ్రత ఉంటుందని భావిస్తున్న అధికారులు, పరీక్షలు రాయకుండానే పాస్ చేయాలని నిర్ణయించారు. విద్యా సంస్థలతో పాటు సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్ లు, పర్యాటక ప్రదేశాలను ఏప్రిల్ 2వ తేదీ వరకు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని కంపెనీల యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more
Aug 10 | దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు... Read more
Aug 10 | ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు... Read more
Aug 10 | ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా... Read more
Aug 10 | వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు... Read more