teen gangraped by four in Andhra Pradesh డిగ్రీ విద్యార్థినిపై నలుగురు అగంతకుల అఘాయిత్యం..

Degree college student gangraped by four in east godavari

Rape, Gangrape, College Girl, College Girl Gangraped in East Godavari, East Godavari district, valluri ramakrishna, sunkara satyanarayana, chamanti madhu, mulukala veerababu, AP CM YS Jagan, sangampunta colony, mandapeta, East Godavari, bricks manufacturing unit, disha act, disha police stations, Andhra Pradesh, crime

Amid new acts and new police stations crime against women is alarming. latest a degree college student was gang rape by four of her college in mandapeta. The police has filed an FIR and investigating the case.

తూర్పుగోదావరిలో దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై నలుగురు అగంతకుల అఘాయిత్యం..

Posted: 03/05/2020 12:48 PM IST
Degree college student gangraped by four in east godavari

ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో అలాంటి ఘటనలు ఏపీలో జరగకుండా కొత్త చట్టాన్ని, చట్టంతోపాటు కొ్త్తగా ఠాణాలను తీసుకువచ్చింది. అయినా.. ఏపీలో మాత్రం అబలలపై మానవ మృగాళ్ల అకృత్యాలకు అంతులేకుండా, అదుపులేకుండా పోతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో తన స్నేహితుడిపై దాడి చేసి తమ కాలేజీ యువతి అన్న కనీస ఇంకితం కూడా లేకుండా దారుణంగా అఘాయిత్యానికి తెగబడ్డారు. అమెపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాల్లో మండపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో మంగళవారం ఫేర్ వెల్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత డిగ్రీ విద్యార్థిని ఒకరు అమె స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్లింది. ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునేందుకు సంగంపుంత కాలనీ వద్ద వున్న ఇటుక బట్టీ సమీపానికి వెళ్లారు. అయితే వీరిని గమనించిన కాలేజీకి చెందిన నలుగురు యువకులు.. వారిని వెంబడిస్తూ ఇటుకట బట్టీ సమీపానికి వచ్చేశారు. అక్కడ చేరుకోవడంతోనే ఆ పరిసరాల్లో ఎవరూ లేరని గమనించారు.

అంతే తమ స్నేహితుడిపై విచక్షణా రహితంగా దాడి చేసి.. యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కాగా, జరిగిన దారుణం నేపథ్యంలో పోలీసులకు చెప్పాలా వద్దా.? అన్న మిమాంసలో వుండిపోయిన యువతి.. ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై వల్లూరి రామకృష్ణ(కిట్టయ్య), సుంకర సత్యనారాయణ(వెంకన్న), చామంతి మధు, ములకల వీరబాబు తనపై దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టాలతో మార్పులు రావని పలువురు చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Gangrape  CM YS Jagan  sangampunta colony  mandapeta  East Godavari  disha act  EG Police  Andhra Pradesh  Crime  

Other Articles