అర్థరాత్రి.. నిషీదిలో నిశ్శబ్దంగా (పెద్దగా వాహనాలు లేకుండా), నిర్జనంగా వున్న రోడ్లు.. అంతే వేగానికి కళ్లెం లేకుండా రయ్ మంటూ ఓ దూసుకోచ్చిన కారు.. వాయువేగంతో పోటీ పడుతున్నట్లు వెళ్తూ.. భరత్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి చేరింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా అదుపుతప్పంది. వేగంతో పోటీ పడే క్రమంలో మన కన్నులు కూడా మనల్ని మోసం చేస్తాయని, నీడ కూడా ఏదో అనుకుని హడలిపోయే ప్రమాదముందని పెద్దలు చెబుతున్నా.. పెడచెవిన పెట్టిన ఓ యువకుడికి యుక్త వయస్సులో నిండునూరేళ్లు నిండిపోయాయి. తనను కన్నవారికి అండగా వుండాల్సిన వయస్సులో వారికి కడుపుకోతను మిగుల్చుతూ అనంతలోకాలకు వెళ్లిపోయాడు.
హైదరాబాద్ నగరంలోని భరత్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పైనుంచి వేగంగా దూసుకెళ్తున్న కారు.. అదుపుతప్పి బ్రిడ్జి పిట్టగోడను ఢికొని కిందపడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన ఇవాళ వేకువ జామున రాత్రి 2.45 నిమిషాల సమయంలో చోటుచుసుకుంది. ప్రమాదఘటన సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. కారు పడిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం సమయంలో కారులో మొత్తం ఆరుగురు వున్నారని సమాచారం.
మృతుడు బొరబండ ప్రాంతంలోని పండిత్ నెహ్రైనగర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారు సోహెల్ అనే యువకుడిదని, రాత్రి పదిన్నర గంటల సమయంలో స్నేహితులతో కలసి భరత్ నగర్ నుంచి ఎర్రగడ్డ వైవు వస్తుండగా, కారు అదుపుతప్పి కిందపడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో సోహేల్ మరణించగా, మిగిలిన నలుగురు చికిత్స పోందుతున్నారు. కాగా మిగిలిన మితిమీరిన వేగమే కారు ప్రమాదానికి కారణమని చెబుతున్న పోలీసులు.. డ్రైవింగ్ సీట్లో వున్న యువకుడు మద్యం సేవించాడా.? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more