పురాతన ప్రేమకు ప్రతిరూపంగా.. సాక్షిభూతంగా నిలచే ప్రాంతమది. ప్రేమ పేరు చెప్పగానే హిందువులకు గుర్తుకువచ్చే శ్రీకృష్ణుడు తన శాంతస్వాభావి రుక్మిణి దేవి పెరిగిన ప్రాంతమది. తన కళ్యాణ జరుగుతున్న క్రమంలో శ్రీకృష్ణుడిపై ప్రేమతో అదే రోజున శ్రీకృష్ణుడి సోదరసమానుడైన శిశుపాలుడి సహాయంతో పారిపోయి గోపాలుడిని పరిణయం అడింది. ఈ ప్రేమకావ్యానికి.. నాటి మధుర జ్ఞాపకాలకు నెలవుగా వున్న ప్రాంతంలో తాము ప్రేమ పెళ్లి చోసుకోబోము అంటూ అమ్మాయిల చేత వినూత్నంగా ప్రమాణం చేయింది ఇక్కడి ఓ కళాశాల. ఇలా చేసిన ఇప్పుడా పాఠశాల వార్తల్లోకి ఎక్కింది.
ఇంతకీ ఆ ప్రాంతమేది.? ఎక్కడుంది.? అసలు ఆ కళాశాల ఎదీ.? ఎందుకిలా ప్రమాణం చేయించింది.? అమ్మాయిల చేతనే ఎందుకు ఈ విధమైన ప్రమాణం చేయించిందన్న అనుమానాలు కలుగుతున్నాయా.? ఈ డీటైల్స్ లోకి ఎంట్రీ ఇస్తే.. రుక్మిణీ దేవి పెరిగిన ఈ ప్రాంతం అమరావతి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంత ఈ ప్రాంతం వుంది. పురాణ ఇతిహాసాలకు రామేశ్వరం త్రేతాయుగానికి సాక్షిభూతంగా నిలిస్తే.. ద్వాపరయుగానికి గుజరాత్ సహా మహారాష్ట్రలోని విదర్భ కూడా అప్పటి వారసత్వ సంపదకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇక్కడే నెలకొన్న ఓ మహిళా కళాశాలలో ప్రేమికుల రోజున విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
ప్రేమికుల రోజును ప్రేమకు సాక్ష్యంగా నిలిచిన ప్రాంతంలో అందుకు భిన్నంగా ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకంగా ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థినులతో ప్రమాణం చేయించింది. వివరాల్లోకి వెళ్తే.. అమరావతి జిల్లా చండూరు రైల్వే ప్రాంతంలోని మహళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం విద్యార్థినులంతా కళాశాలకు రాగానే వారితో ప్రేమకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. ‘నా తల్లిదండ్రులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ప్రేమలో పడను. ప్రేమ పెళ్లి చేసుకోను. అంతేగాక, కట్నం తీసుకునేవాడిని కూడా పెళ్లి చేసుకోను’ అని విద్యార్థినులు మరాఠీలో ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. ‘ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఏముంది..? పెళ్లి విషయంలో మన తల్లిదండ్రులే సరైన నిర్ణయం తీసుకుంటారు. మనకు సరిపోయే వ్యక్తిని తీసుకొస్తారు. అందుకే మేం ప్రేమ పెళ్లికి వ్యతిరేకం’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ప్రమాణాలపై బీజేపి నేత, మాజీ మంత్రి పంకజ్ ముండే తీవ్రంగా స్పందించారు. అమ్మాయిల చేతనే ప్రమాణాలు ఎందుకు చేయించారని, బాలుర చేత ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. ఇక అమరావతి పురాణ ఇతిహాసంలోకి వెళ్తే.. అమరావతి ప్రాంతంలోని కౌండిన్యపూర్ గ్రామం.. ఒకప్పటి విదర్భకు రాజధాని అని, దానిని భీష్మిక అనే రాజు పాలించేవాడని సమాచారం. కాగా, రుక్మిణి శ్రీకృష్ణుడిని ప్రేమించి పెళ్లి రోజున ఇంట్లోంచి శిశుపాలుడి సాయంతో పారిపోయి గోపాలుడ్ని పెళ్లాడిందని పురాణ కథ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more