బకాయి పడిన మొత్తాన్ని చెల్లించని టెలికాం కంపెనీలకు టెలి కమ్యూనికేషన్ల డిపార్ట్ మెంట్ డెడ్ లైన్ విధించింది. బకాయిలు రాబట్టడంలో విఫలమయ్యారంటూ కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు అర్ధరాత్రి 11.59 గంటల కల్లా బకాయిలను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. సర్కిల్, జోనళ్ల వారీగా టెలికాం శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది.
టెలికం సర్వీసు ప్రొవైడర్లు శుక్రవారం అర్ధరాత్రి కల్లా బకాయిలన్నీ క్లియర్ చేయాలని యూపీ (పశ్చిమ) టెలికం సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కాగా, టెలికాం శాఖ ఆదేశాల నేపథ్యంలో బకాయిలు చెల్లించేందుకు ఎయిర్టెల్ సంస్థ ముందుకొచ్చింది. ఈ నెల 20న రూ.10వేల కోట్లు చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఏజీఆర్ ఛార్జీల కింద బకాయి పడ్డ రూ.వేల కోట్లను ఇంకా ఎందుకు చెల్లించలేదని సుప్రీంకోర్టు శుక్రవారం టెలికాం సంస్థలను ప్రశ్నించిన నేపథ్యంలో ఎయిర్ టెల్ ఈ మేరకు పేర్కోంది.
టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 92 వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను వసూలు చేయవద్దంటూ సంబంధిత అధికారులకు టెలికాం మంత్రిత్వ శాఖ డెస్క్ ఆఫీసర్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. డెస్క్ అధికారితో పాటు టెలికాం సంస్థలకు కోర్టు ధిక్కార నోటీసులు పంపింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టును ఎత్తేద్దామా? అని ఆయన ప్రశ్నించారు. తమ ఆదేశాలనే డెస్క్ అధికారి పక్కనపెట్టేశారని... అతనికి అతను జడ్జిగా ఊహించుకున్నట్టున్నారని అన్నారు.
తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సదరు అధికారి లేఖలు రాశారని... సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన ఎలా పక్కన పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎలాంటి న్యాయం మిగల్లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో బతకడం కంటే... దేశాన్ని వదిలి వెళ్లిపోవడమే మంచిదని అన్నారు. తాను ఎంతో ఆవేదనకు గురవుతున్నానని... ఈ కోర్టులో పని చేయకపోవడమే మంచిదనిపిస్తోందని చెప్పారు. ఇలాంటి వ్యవస్థలో ఎలా పని చేయాలని ప్రశ్నించారు. సదరు అధికారి నిర్ణయం వెనుక డబ్బు కోణం ఉందా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఆ అధికారి జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more