నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికలలో గెలుపోందడం ద్వారా వారి నేరచరిత్ర కనుమరుగవుతుందని భావించడం తగదని అభిప్రాయపడిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. అదే సమయంలో కళంకిత ప్రజాప్రతినిధుల చమ్మక్కులకు రాజకీయ పార్టీల గిమ్మిక్కులకు చెక్ పెట్టింది. కళంకిత ప్రజాప్రతినిధులపై గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని క్యాబినెట్ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శల నుంచి వివరణను కూడా కోరింది. ఇదే సమయంలో ఎన్నికలను నేరచరిత్ర రహితంగా ఉంచేందుకు ఏలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై వివరణను వారం రోజుల్లో తమకు సమర్పించాలని న్యాయస్థానం కేంద్రఎన్నికల సంఘాన్ని అదేశించింది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2018 సెప్టెంబరు 25న ఇచ్చిన ఆదేశాలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ.. నేరచరిత్రుల నేరాలను బహిరంగపర్చకుండా వారు ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలో దోహదపడుతూ.. కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నాయంటూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై జస్టిస్ ఆర్ఎఫ్ నారిమణ్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ లతో కూడిన న్యాయస్థాన ధర్మాసానం ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా మరోమారు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పనిసరిగా అమలుచేయాలన్న బెంచ్.. తాజాగా రాజకీయ పార్టీలు కూడా కళంకితులను ఎందుకు బరిలో దింపుతున్నారో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
రాజకీయాలను నేరరహితంగా మార్చేందుకు ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల నేర చరిత్ర.. వాటి వివరాలను, పార్టీలు ఆ అభ్యర్థులను బలపర్చినందుకు కారణాలను బయట పెట్టాల్సిందేనంటూ రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తమ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని స్పస్టం చేసింది. ఇక కళంకిత నేతలు ఎన్నికల బరిలో దిగుతున్న సందర్భంలో వారి గురించి దినపత్రికలతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా గణనీయంగా ప్రచారాన్ని కల్పించాల్సిందేనని పేర్కోంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం వాదనలు వినిపిస్తూ.. కళంకితులకు రాజకీయ పార్టీలు బరిలో దింపకుండా ఆదేశాలను ఇవ్వాలని కోరింది.
సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ బీజేపి నేత, ప్రముఖ సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును వెలువరిస్తూ.. గత నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి రాజకీయాల్లో నేరస్థుల సంఖ్య పెరుగుతూపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నేర చరిత్ర గల అభ్యర్థులపై 72 గంటల్లోగా ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాలని సూచించింది. సుప్రీం ఆదేశాలను రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తే గనుక ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని ఈసీని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more