ప్రేమోన్మాదంతో పేట్రేగిపోయేవారి అన్ని విభాగాలతో వున్నారు. మరీముఖ్యంగా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని పట్టుకుని చట్టప్రకారం శిక్షించాల్సిన పోలీసు శాఖలోనే ఇలాంటి ఘటన ఉన్నతాధికారులతో పాటు ప్రజలను షాక్ కు గురిచేస్తున్నారు. ప్రేమను తిరస్కరించిందనే కారణంతో తోటి మహిళా ఎస్సైని మరోక ఎస్సై కాల్చి చంపిన ఘటన వాయువ్య ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ఒక రోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం శోచనీయం. శుక్రవారం రాత్రి వాయువ్య ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.
26 ఏళ్ల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతి అహ్లావత్.. రోహిణి ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో మరోక ఎస్సై దీపాన్షు రతి ఆమెపై కాల్పులు జరిపాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించారు. దీపాన్షు ప్రీతిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. ప్రీతి తలలోకి బుల్లెట్లు దిగటంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి శవపరీక్ష నిర్వహిస్తున్నారు. దీపాన్షు పోలీసు అకాడమీలో 2018లో ఆమె బ్యాచ్ మేట్ అని పోలీసులు వివరించారు. కానీ ఇంత వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు.
హర్యానాలోని సోనిపట్కు చెందిన ప్రీతి.. పత్పర్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ రోహిణీలోని ఒక అపార్ట్ మెంట్లో అద్దెకు ఉంటున్నారు. ప్రీతి అహ్లవత్ను హత్య చేసిన తర్వాత దీపాన్షు రతి కూడా హర్యానాలోని సోనిపట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీపాన్షు రతి, ప్రీతి అహ్లావత్ ను ప్రేమిస్తున్నాడని...అతడి ప్రేమను, పెళ్లి ప్రపోజల్ ను ఆమె తిరస్కరించినందువల్లే కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల చెక్ పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీసుల పారా మిలటరీ బలగాలను రహదారులపై మొహరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more