బీజేపీ నేత, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్రావు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన బాధితురాలు ఆయన లీడర్ కాదని అమ్మాయిలను తార్చే ఓ బ్రెకర్ అంటూ తీవ్ర పదజాలంతో అరోపణలు గుప్పించింది. అయన బ్యూ ఫిల్మ్ సప్లయర్ అని అరోపించిన ఆమె తనకు రఘునందన్ రావు గత 12ఏళ్లుగా నరకం చూపుతున్నాడని పేర్కోంది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్ కు చెందిన బాధితురాలు.. ఈ విషయమై గతంలో పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా తన రాజకీయ పలుకుబడితో తనను అడ్డుకున్నాడని అమె తెలిపింది.
ఈ కేసు విషయమై ఇవాళ తాజాగా మరోమారు మీడియా ముందుకు వచ్చిన అమె.. రఘునందన్ రావుపై సంచలన అరోపణలు చేశారు. ఆయన అమ్మాయిలను తార్చే బ్రోకర్ అని.. నీలి చిత్రాల సప్లయర్ అని పేర్కోన్నారు. కేసుల పరిష్కారం కోసం వచ్చే ఆడవారిని రఘునందన్ రావు భయపెట్టి లొంగదీసుకుంటాడని బాధితురాలు ఆరోపించారు. అనంతరం వారితో బ్లూ ఫిలింగ్ తీసి రాజకీయ నాయకులకు పంపిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తాడని చెప్పారు.
హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లై చేసేది రఘునందన్ రావేనన్నారు. అతనే దగ్గరుండి పరిచయం చేయించి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావుకు సప్లై చేయించేవాడని బాధితురాలు తెలిపారు. నీలిచిత్రాలకు సంబంధించిన యూనిట్ ముంబైలో ఉందని... అక్కడి నుంచి ఇవి సప్లయి అవుతూ ఉంటాయని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన బాగోతాన్ని పూర్తి ఆధారాలతో సహా తాను 2012లో పట్టిస్తే సీసీఎస్ పోలీసులు కేస్ క్లోజ్ చేశారని అరోపించారు. అయితే కేసును దర్యాప్తు చేయకుండా ఎందుకు క్లోజ్ చేశారని అడిగితే.. రఘునందన్ రావు చెప్పడంతోనే తాము క్లోజ్ చేశామని పోలీసులు బదులిచ్చారని బాధితురాలు తెలిపారు.
రఘునందర్ రావు మీకు బాస్ కాదుగా.. మీరు నేరం జరగుతున్నది వాస్తవమా.? కాదా.? అన్న కోణంలో విచారించి.. మీ ఉన్నతాధికారులకు బదులివ్వాలని తాను కోరితే.. ఈ విషయంలో మరింత ఎక్కువ జోక్యం చేసుకున్నా.. కేసు విషయమై నోరు జారినా.. ఎక్కడైనా మాట్లాడినా.. ఎన్ కౌంటర్ చేస్తానని సీఐ రాజశేఖర్ రెడ్డి తనకు బహిరంగంగానే ఎన్నోసార్లు బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో రఘునందన్ రావు, సిఐ రాజశేఖర్ రెడ్డిలు మంచి మిత్రులయ్యారని.. దీంతో తనపై కక్ష పెట్టుకుని తనను చంపేందుకు రఘునందన్ యత్నిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ కేసు విషయమై తాను ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసినా.. వారు తమ హోదా, పలుకుబడితో అడ్డుకుంటారని బాధితురాలు అవేధన వ్యక్తం చేశారు. రఘునందన్ రావును అడ్డం పెట్టుకుని శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు పబ్బం గడుపుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేసి, వ్యాపారాలు చేస్తున్నారని బాధిత మహిళ మండిపడ్డారు. సంవత్సరం పాటు కేసు తీసుకోకుండా తనను ప్రతిరోజూ తిప్పేవారని.. రఘునందన్ రావు వచ్చి తనకు అడ్డుపడేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంఘంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న వీళ్లు అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
కాగా, తనపై వస్తున్న ఆరోపణల పట్ల రఘునందన్ స్పందించారు. ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నూటికి నూరు శాతం అవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఈ అంశంలో తనమీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మరోసారి వివరణ ఇస్తానని వెల్లడించారు. అంతేకాదు, తనకు ఈ వ్యవహారంలో ఎవరూ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more