దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో మరో దోషి దోషి అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థనకు దరఖాస్తు చేసుకున్నాడు. నిర్భయ కేసులో సహచర దోషి వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే మరో దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్షకు అప్పీలు చేసుకోవడం గమనార్హం. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆయన పెట్టుకున్న క్యూరేటివ్ పిటీషన్ న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో ఆయన మెర్సీ పిటీషన్ పెట్టుకున్నారు.
రెండు రోజుల క్రితం అక్షయ్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మహిళలపై హింసకు సంబంధించిన కేసుల్లో ప్రజల నుంచి ఎదురయ్యే ఒత్తిడి, ప్రజాభిప్రాయాలను అనుసరించి కోర్టులు సర్వరోగ నివారిణిగా దోషులకు మరణశిక్ష విధిస్తున్నాయని అతడు తన క్యూరేటివ్ పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ ను ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రత్యేక ఛాంబర్లో పరిశీలించిన అనంతరం తిరస్కరించింది. కాగీ నిర్భయ కేసు న్యాయస్థానం నలుగురు దొషులకు ఉరిశిక్షను విధించిన తరువాత దానిని తప్పించుకునే క్రమంలో దోషులు ఎత్తుగడలు వేస్తున్నారు.
వీరితో ముకేశ్ కు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలూ ముగిసిపోయాయి. ఇక అక్షయ్ కు కూడా ఈ క్షమాభిక్ష పిటిషన్తో ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నీ మూసుకుపోనున్నాయి. నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాల్సి ఉండగా ఢిల్లీలోని పాటియాల కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. కాగా, ఇవాళ ఉరి తీసేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేయగా, చివరి నిమిషంలో వాళ్లు ఉరిశిక్ష అమలుపై స్టే విధించాల్సిందిగా దోషులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఢిల్లీ కోర్టు ఉరి అమలును వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉరి ఆపాలని తీహాడ్ జైలు అధికారులకు తెలిపింది.
ఈ నలుగరు దోషుల్లో పవన్ గుప్తా ఒక్కడే ఇప్పటివరకు అుట క్యూరేటివ్ పిటీసన్ కానీ, మెర్సీ (క్షమాభిక్ష) పిటీషన్ కానీ న్యాయస్థానంలో దాఖలు చేయలేదు. ఎటువంటి న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోలేదు. క్యూరేటివ్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. ఉరి అమలుపై స్టే విధించడంపై నిర్భయ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. ఇటువంటి వ్యక్తులకు జీవించే హక్కు లేదని, బతికి ఉంటే ఏదో ఒక విధంగా ఉరి ఆపేందుకు ప్రయత్నాలు జరుపుతూ న్యాయవ్యవస్థను అవహేళన చేస్తున్నారని బీజేపి ఎంపీ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు దోషులను తక్షణమే ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more