మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించనందునే తన తండ్రి హత్యకేసును సిబిఐకి అప్పగించాలని కోరుతున్నట్లు వివేకా కూతురు సునీత తెలిపారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాచ్ మెన్ రంగన్న ఇంటిని చూసుకోకుండా రాత్రంతా ఎలా నిద్రపోయారు.? హత్య గురించి తెలియదని రంగన్న అంటున్నారు. ఆ రోజు రాత్రి ఏమైనా అరుపులు.. కేకలు విన్నారా.? అన్న విషయాలను కూడా ఆయన వెల్లడించలేదని అమె పేర్కోన్నారు.
ఇక తాను పి.రాజశేఖర్ అనే వ్యక్తి ఎప్పుడు వస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు 2019 మార్చి 14న తాను ఫోన్ చేసిన విషయాన్ని కూడా రంగన్న నిరాకరిస్తున్నారని, ఈ విషయాన్ని కూడా పోలీసులు ఇప్పటి వరకు తేల్చలేకపోయారని అమె అన్నారు. తన తండ్రి తల, శరీరంపై లోతైన గాయాలు వున్నాయని, వాటి సంఖ్యను గమనిస్తే.. ఈ దాడిలో ఒకరు కంటే ఎక్కువ మంది పోల్గొన్నట్లు తెలుస్తోందని అన్నారు. అగంతకుల దాడి నుంచి వివేక తప్పించుకునేందుక కూడా ప్రయత్నించినట్లు అర్థమవుతోందని.. ఆ సమయంలోనూ వాచ్ మెన్ రంగన్న ఏం చేస్తున్నారని.. అసలు రంగన్న వుండగా అగంతకులు ఎలా వచ్చారు.. ఎలా తప్పించుకున్నారని అని కూడా సునిత ప్రశ్నిస్తున్నారు.
వివేకా మృతదేహంపై గాయాలున్నా గుండెపోటుతో మరణం అంటూ మీడియాలో ఎలా ప్రసారమైంది.? హత్య జరిగిన మరుసటి రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిఐ ఘటనాస్థలికి వెళ్లి వివేకా ఒంటిపై వున్న గాయాలను పరిశీలించిన తరువాత కూడా అది అనుమానాస్పద మరణంగా ఎలా నమోదు చేశారు. హత్య జరిగి మనిషి చనిపోయిన తరువాత డాక్టర్ వివేకా మృతదేహం వున్న పడకగదిలో ఎందుకున్నారు.? గదిలో రక్తపు మరకలను శుభ్రం చేయాలని లక్ష్మమ్యను ఎర్రగంగిరెడ్డి ఎందుకు ఆదేశించారు. సాక్ష్యాధారాలను మాయం చేశారన్న అభియోగాలను ఎందుకు మోపలేదు.? అని సునిత తన పిటీషన్ లో పేర్కోన్నారు.
ఇక విచారణ చేస్తున్న సిట్ ను మూడు పర్యాయాలు ఎందుకు మార్చారని.. అడిషనల్ డీజీ స్థాయి అధికారి నుంచి దానిని ఎస్పీ స్థాయి అధికారికి మార్చడానికి కారణాలను ఏంటని ప్రశ్నించారు. వివేకా హత్యకేసు జరిగి 10 నెలలు గడుస్తున్నా.. పురోగతి గురించి పోలీసులు ఎందుకు మాట్లాడటం లేదు? హత్యలో ప్రధాన అనుమానితుడైన వైసీపీ నేత పరమేశ్వరరెడ్డి... హత్య జరిగిన తర్వాత ఉదయం ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఎందుకు కలిశారు? ఇలా పలు అనుమానాలను సునీత తన పిటిషన్ లో వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో విచారణ సవ్యంగా జరగాలన్నా, వాస్తవాలు వెలుగులోకి రావాలన్నా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు.
ఇక దీంతో పాటు తన తండ్రిని హతమార్చిన హంతకుల నుంచి తమకు కూడా ప్రాణహాని వుందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు, తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ కు సాయుధ రక్షణ కల్పించాలని కోరుతూ గతేడాది నవంబరు 21న డీజీపీ గౌతమ్ సవాంగ్కు రాసిన లేఖను కూడా జతపర్చారు. వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలని విన్నవిస్తూ రెండు రోజుల కిందట హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు ఈ లేఖను ఆమె జతపరిచారు. ఇక ఈ కేసులో కీలకమైన శ్రీనివాసరెడ్డి హత్య నేపథ్యంలో.. పరమేశ్వరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, రంగయ్యల ప్రాణాలకు కూడా ముప్పు ఉందన్న అమె లేఖలో అనుమానాన్ని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more