లండన్ సదస్సులో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురైన నిమ్స్ డాక్టర్ మీనా కుమారి మృతి చెందారు. ఆమెను కాపాడటానికి లండన్ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన మీనాకుమారిని కాపాడటానికి వైద్యులు చివరి నిమిషం వరకు ప్రయత్నించారని యూకే డిప్యూటి హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ వెల్లడించారు. ఆమె కుటుంబానికి, సన్నిహితులకు సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
నిమ్స్ ఆస్పత్రి న్యూరో విభాగంలో సీనియర్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ మీనాకుమారి అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనడానికి ఇటీవల లండన్ వెళ్లారు. అక్కడ సదస్సులో ఉపన్యసిస్తుండగా ఆమె గుండెపోటుకు గురై కుప్పకూలారు. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మీనాకుమారి ఆరోగ్యం విషమించడంతో లండర్ వైద్యులు ఆమెను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. అమె గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించి మూడు స్టెంట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు.
అయితే.. హార్ట్ ఫెయిల్యూర్ ప్రభావం మీనాకుమారి మెదడుపై తీవ్రంగా పడిందని.. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్నారని వెల్లడించారు. మీనాకుమారి మృతితో ఆమె కుటుంసభ్యులు, నిమ్స్ వైద్యులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమిళనాడుకు చెందిన మీనాకుమారి కుటుంబం ఎన్నో ఏళ్ల కిందటే భాగ్యనగరానికి వచ్చి స్థిరపడింది. గాంధీ ఆస్పత్రి నుంచి మీనాకుమారి ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను పూర్తి చేశారు. నిమ్స్లో 25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆమె అంచెలంచెలుగా ఫ్రొఫెసర్ స్థాయికి ఎదిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more