ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి వికేంద్రీకరించి మూడు ప్రాంతాలలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామన్న స్పష్టమైన సంకేతాలను ప్రభుత్వం నుంచి వచ్చిన తరుణంలో.. రాజధాని ప్రాంతాలలో పర్యటించి.. ఆక్కడి రైతులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వైఎస్ జగన్ సర్కారుపై తనదైన శైలిలో విమర్శలను సంధించారు. పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ తరహాలో అమరావతి రైతుల పోరాటం కూడా సాగాలని.. రాజధాని అంశం అంటే చిన్నదేమీ కాదని పవన్ ఇదివరకే సూచించారు.
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ తో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ది, సమతుల్యం పాటిస్తామన్న జగన్ మాటలపై పవన్ తనదైనశైలిలో విమర్శలు సంధించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు కాదు.. త్రిశంకు రాజధానిని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందని పవన్ కల్యాణ్ సినీ పంచ్ విసిరారు. రాజధాని కోసం జరుగుతున్న పోరాటాన్ని అరెస్టులతోను, గృహ నిర్బంధాలతోను ఆపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని అంశంలో రోజురోజుకు రైతులు ఉద్యమం బలపడుతోందని, అయితే పోలీసు బలగాలు ఎంత పెంచినా లాభం లేదన్న భ్రమల్లోంచి ముఖ్యమంత్రి బయటికి రావాలని పవన్ కల్యాణ్ సూచించారు.
రెండ్రోజులుగా మరింత తీవ్ర రూపం దాల్చిన రాజధాని రైతుల ఆందోళన పర్వంలో ఇవాళ పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో జనసేనాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. చినకాకానీ వద్ద రైతుల అగ్రహాన్ని చూసిన ప్రభుత్వం క్యాబినెట్ భేటీని వాయిదా వేసుకుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. పార్టీ పెద్దల కోసం కాకుండా ప్రజల కోసం అలోచించాలని సూచించారు. జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ అమరావతి ప్రాంతాన్ని మరో నందిగ్రామ్ గా మార్చాలనుకుంటోందని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే ఉత్తరాంధ్ర వాసులు కూడా సంతృప్తికరంగా లేరని పవన్ కల్యాణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
రాయలసీమ వాసులకు సుదూరంగా రాజధానిని ఏర్పాటు చేసి, జగన్ ఏమి సాధించాలనుకుంటున్నారని జనసేనాని ప్రశ్నించారు. రాయలసీమకు దూరంగా, ఉత్తరాంధ్రకు ఉపయోగపడని, దక్షిణ కోస్తా వారికి అంతుచిక్కని రాజధానిని ఏర్పాటు చేస్తే ఎవరికి ఉపయోగమని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి రాజధానిని ఏర్పాటు చేస్తే అది త్రిశంకు రాజధానే అవుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్ళిన ఉద్యోగులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని, వారిని రాజధాని తరలింపు పేరిట మరోచోటికి షిప్టు చేస్తే.. ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని పవన్ కల్యాణ్ అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more