Pawan Kalyan slams YS Jagan Govt on Three capitals త్రి క్యాపిటల్సా.? త్రిశంకు రాజధానా.?: ఫవన్ ఫైర్

Jana sena chief pawan kalyan slams ys jagan govt on three capitals

Janasena, Pawan Kalyan, pawan kalyan twitter, pawan kalyan trishanku rajadhani, Mangalagiri, Amaravati, shifting of capital, 29 Villages, Three Capitals, YSRCP Government, vishakapatnam, Rayalaseema, division between regions, HighCourt, Kurnool, andhra pradesh, politics

Jana Sena chief Pawan Kalyan was blocked by police while he was on his way to Madadam village from Krishnayapalem. The police have directed him to move on to Tulluru for which the Jana Sena cadre and farmers fired at police.

మూడు రాజధానులు కాదు.. త్రిశంకు రాజధాని: పవన్ కల్యాణ్

Posted: 01/07/2020 06:43 PM IST
Jana sena chief pawan kalyan slams ys jagan govt on three capitals

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి వికేంద్రీకరించి మూడు ప్రాంతాలలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామన్న స్పష్టమైన సంకేతాలను ప్రభుత్వం నుంచి వచ్చిన తరుణంలో.. రాజధాని ప్రాంతాలలో పర్యటించి.. ఆక్కడి రైతులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వైఎస్ జగన్ సర్కారుపై తనదైన శైలిలో విమర్శలను సంధించారు. పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ తరహాలో అమరావతి రైతుల పోరాటం కూడా సాగాలని.. రాజధాని అంశం అంటే చిన్నదేమీ కాదని పవన్ ఇదివరకే సూచించారు.

రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ తో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ది, సమతుల్యం పాటిస్తామన్న జగన్ మాటలపై పవన్ తనదైనశైలిలో విమర్శలు సంధించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు కాదు.. త్రిశంకు రాజధానిని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందని పవన్ కల్యాణ్ సినీ పంచ్ విసిరారు. రాజధాని కోసం జరుగుతున్న పోరాటాన్ని అరెస్టులతోను, గృహ నిర్బంధాలతోను ఆపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని అంశంలో రోజురోజుకు రైతులు ఉద్యమం బలపడుతోందని, అయితే పోలీసు బలగాలు ఎంత పెంచినా లాభం లేదన్న భ్రమల్లోంచి ముఖ్యమంత్రి బయటికి రావాలని పవన్ కల్యాణ్ సూచించారు.

రెండ్రోజులుగా మరింత తీవ్ర రూపం దాల్చిన రాజధాని రైతుల ఆందోళన పర్వంలో ఇవాళ పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో జనసేనాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. చినకాకానీ వద్ద రైతుల అగ్రహాన్ని చూసిన ప్రభుత్వం క్యాబినెట్ భేటీని వాయిదా వేసుకుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. పార్టీ పెద్దల కోసం కాకుండా ప్రజల కోసం అలోచించాలని సూచించారు. జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ అమరావతి ప్రాంతాన్ని మరో నందిగ్రామ్ గా మార్చాలనుకుంటోందని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే ఉత్తరాంధ్ర వాసులు కూడా సంతృప్తికరంగా లేరని పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాయలసీమ వాసులకు సుదూరంగా రాజధానిని ఏర్పాటు చేసి, జగన్ ఏమి సాధించాలనుకుంటున్నారని జనసేనాని ప్రశ్నించారు. రాయలసీమకు దూరంగా, ఉత్తరాంధ్రకు ఉపయోగపడని, దక్షిణ కోస్తా వారికి అంతుచిక్కని రాజధానిని ఏర్పాటు చేస్తే ఎవరికి ఉపయోగమని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి రాజధానిని ఏర్పాటు చేస్తే అది త్రిశంకు రాజధానే అవుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్ళిన ఉద్యోగులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని, వారిని రాజధాని తరలింపు పేరిట మరోచోటికి షిప్టు చేస్తే.. ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని పవన్ కల్యాణ్ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles