కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు. తానిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. పోలిస్ స్టేషన్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో వున్న నేతలపై పిర్యాదు తీసుకోరా.? అంటూ మండిపడ్డారు. కేసు పెట్టలేదని పోలీసు అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దానిపై కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. పోలీసుల సమాధానంతో సంతృప్తి చెందన వి.హెచ్ ఈ విషయంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పోలీసులను హెచ్చరించారు.
మంగళవారం మధ్యాహ్నం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న హనుమంతరావు సి.ఐ, ఎస్.ఐ.లతో భేటీ అయ్యారు. తను వారం రోజుల కిందట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పైన ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని వి.హెచ్. పోలీసు అధికారులను నిలదీశారు. తాము న్యాయనిపుణుల అభిప్రాయాలను తీసుకున్నామని, ఇందులో కేసు నమోదు చేసే అంశాలు లేవని.. అందుకే కేసు నమోదు చేయలేక పోయామని పోలీసులు సమాధానమిచ్చారు. దాంతో విహెచ్ ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు కొన్ని పార్టీలపై పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ.. మరికొన్ని రాజకీయ పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన అరోపించారు.
చౌకిదార్ చోర్ అన్నందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టి.. ఎన్నికల సమయంలో బలవంతాన అడిగించుకుని క్షమాపణ చెప్పించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సెక్యూలర్ దేశమైన భారత్ తోని 130 కోట్ల మంది హిందువులేనంటూ మిగిలిన మతాలవారి మనస్సులను గాయపర్చిన ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్పై కేసు ఎందుకు పెట్టరని వీహెచ్ ప్రశ్నించారు. మోహన్ భగవత్ ప్రకటన చేసిన తరువాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దేశంలో అన్ని మతాలు సమానమని వ్యాఖ్యానించారని అన్నారు. వీరిద్దరిలో ఎవరి మాటలను నమ్మలాని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విహెచ్.. హైకోర్టును ఆశ్రయిస్తానంటూ పోలీస్ స్టేషన్ నుంచి నిష్క్రమించారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more