కలియుగ ప్రత్యక్ష దైవం.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు తన కల్యాణం కోసం కుభురుడి నుంచి పొందిన రుణాన్ని తన భక్తులు తీర్చుతారని.. అందుకే తాను ఏడుకొండలపై వెలుస్తానని ప్రకటించారని ఓ పురాణకథ వుంది. అయితే ఆ పురాణకథ ప్రకారం కలియుగంలో భక్తులు వడ్డీకాసులవాడు ఇచ్చిన మాట కోసం తమ శక్తికొలది కానుకలు సమర్పిస్తూనే వున్నారు. అవి కొంత కొంతగా ఇంతైవటుడింతై అన్న చందాన.. ఏడాదికేడాది పెరుగుతూ వేల కోట్ల రూపాయలకు చేరుకుంటున్నాయి.
భక్తుల విరాళాలుగా స్వామివారికి సమర్పించిన హుండీ ఆదాయం వార్షికానికి వేల కోట్లకు చేరుకుంటుంది. తాజాగా ముగిసిన 2019 వార్షిక సంవత్సరానికి వెంకన్న ఆలయం నిత్యం భక్తులతో కిట కిట లాడుతూనే ఉంటుంది. భక్తులు ఈ ఆలయానికి ఎలా వస్తుంటారో... స్వామివారికి వచ్చే కానుకలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. గతేడాది స్వామివారి హుండీ ఆదాయాన్ని టీటీడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 2019లో రూ.1,161.74 కోట్ల నగదు హుండీ ఆదాయంగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ ఈ వివరాలను తెలిపారు. 2018తో పోలిస్తే..... 2019లో స్వామివారి హుండీ ఆదాయం 8.9శాతం పెరిగినట్లు చెప్పారు. ఇక 2019లో స్వామివారిని 2,78,90,179మంది భక్తులు దర్శించుకోగా... 2018లో 2,68,02,047 మంది దర్శించుకున్నారు. ఇక 2019లో 6,45,73,250మంది భక్తులకు అన్నప్రాసాదం అందించగా... 2018లో 6,08,76,434 మంది అన్నప్రసాదం అందించారు.
ఇదిలా ఉండగా.. సోమవారం (జనవరి 6) వ తేదీన వైకుంఠ ఏకాదశి కావడంతో.. ఆరోజు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. అయితే హైకోర్టు అదేశాల మేరకు పది రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం కల్పించే అంశంపై అదివారం భేటీ కానున్న టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అనీల్ సింఘాల్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more