ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవరావతిలో బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కోనసాగించాలని డిమాండ్ చేస్తూ మందడంలోని మార్కాపురం కూడలి వద్ద నిరసన తెలిపిన మహిళలు, రైతులపై పోలీసులు దౌర్జన్యం చేశారన్న వార్తలతో అప్రమత్తమైన అమరావతి గ్రామాల ప్రజలు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. తాము సకల జనుల సమ్మెకు దిగి.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన తొలిరోజునే పోలీసులు తమ ఉద్యమాన్ని అణిచివేయాలని చూశారని రైతులు అరోపించారు.
నిరసన కార్యక్రమాలకు దిగిన మహిళలను కూడా బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించడంపై మండిపడ్డ రైతులు అమరావతి బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు స్వచ్ఛంధంగా బంద్ పాటిస్తున్నారు. కాగా అత్యవసర సేవలను మినహాయించి అన్ని వ్యాపారాలను మూసివేశారు. గత పద్దెనిమిది రోజులుగా నిరసన కార్యక్రమాల్లో రైతులతో పాటు విద్యార్థులు, మహిళలు కూడా పాల్గొంటున్నారు. దుకాణాలను తెరిపించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
దీంతో పాటు తమ దుకాణాల ఎదుట పోలీసులు కూర్చునేందుకు కూడా ఆయా దుకాణాదారులు సమ్మతించడం లేదు. అంతేకాదు తమ శాంతియుత నిరసన కార్యక్రమాలకు సహకరించాలని కాళ్లు మొక్కినా పోలీసుల నుంచి సానుకూలత రాకపోవడంతో వారికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించరాదని కూడా స్తానిక ప్రజలు నిర్ణయించుకున్నారు. పోలీసులకు మంచి నీళ్ల బాటిళ్లను కూడా విక్రయించకూడదని కూడా అమరావతివాసులు తీర్మాణించుకున్నారు. పోలీసులు తమ గ్రామాల మీదుగా వెళ్లడానికి వీల్లేదని వెనక్కి పంపించారు. దీంతో పోలీసులకు రైతులకు వాగ్వాదం జరిగింది. బంద్ కారణంగా రైతులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more