ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవరావతినే కోనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు ఇవాళ్టి నుంచి మరింత ఉదృతంగా మారాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు గత పదిహేడు రోజులుగా నిరసనలురైతులతో పాటు విద్యార్థులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాలుపంచుకుంటున్నారు. దీంతో ఇవాళ్టి నుంచి అమరావతి ప్రాంతంలో సకలజనుల సమ్మెను తలపెట్టారు. ఇవాళ తొలిరోజు సమ్మెలో భాగంగా అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలను అక్కడి ప్రజలు స్వచ్చంధంగా నిలిపివేశారు.
రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను ఇప్పటికైనా సీఎం జగన్, ఏపీ ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్ కోసమంటూ భూములు తీసుకుందని.. ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు రాజధానులంటూ మరో ప్రతిపాదనను తీసుకువచ్చిందని.. ఇలా ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా తమను అందోళనకు గురిచేస్తే ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా మందడంలో రైతులు దుకాణాలు మూసివేయించారు. దుకాణాలు తెరిపించేందుకు పోలీసులు యత్నించడంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎస్.ఆర్.ఎం వర్సిటీ బస్సులను అడ్డుకున్న ఆందోళన కారులు రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంగళగిరి అంబేద్కర్ కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఎర్రబాలెం, నీరుకొండ, నవులూరు గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో వివిధ రాజకీయ పక్షాలు అమరావతికోసం ఆందోళనలకు సిద్ధమయ్యాయి. మందడంలో ఇంటింటికీ వెళ్లి గులాబీ పూలు ఇచ్చిన రైతులు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతులు సచివాలయం వైపు వెళ్లే రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలు తుడిచి పూలు ఇచ్చి సకల జనుల సమ్మెకు మద్దుతు కోరుతున్నారు.
ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో అసైన్డ్ భూముల రైతులు, కూలీలు నిరసన దీక్షచేపట్టారు. మరో వైపు వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో రైతులకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. గతరాత్రి పలువురు రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు307 హత్యాయత్నం కేసుతో పాటు మరో ఏడు సెక్షన్ల కింద కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్ కు రావాలని పేర్కొన్నారు. విచారణకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు రావాలని వెలగపూడి, మల్కాపురం గ్రామస్థులకు నోటీసులు అందజేశారు. దాదాపు 15మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు జారీ అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more