నలుగురు కళాశాల విద్యార్థినులు మగ స్నేహితులతో కలిసి పీకలదాకా మద్యం తాగి తందనాలాడారు. ఇంతవరకు బాగానే వున్నా ఈ వీడియో కాస్తా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో తీవ్ర కలకలం రేపింది. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణంలో సంచలనం రేపిన ఈ ఘటన నలుగురు విద్యార్థినుల కాలేజ్ బహిష్కరణకు కూడా కారణమైంది. అసలేం జరిగింది.. అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. నాగపట్టణం జిల్లాలోని మైలదుత్తురాయ్ పట్టణంలోని ధర్మాపురం అధీనం ఆర్ట్స్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు డిగ్రీ చదువుతున్నారు.
ఓ యువతి బీఏ ఇంగ్లీషు లిటరేచర్లో రెండో సంవత్సరం, మరో ముగ్గురు అమ్మాయిలు బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నారు. నలుగురు అమ్మాయిల్లో ఒకరి జన్మదినం ఉండటంతో కళాశాలకు పది కిలోమీటర్ల దూరంలోని సీతార్ కదు గ్రామంలోని ఒకమ్మాయి ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. ఈ మందు పార్టీలో ముగ్గురు అమ్మాయిలు కళాశాల యూనిఫాం ధరించి మగ స్నేహితులతో కలిసి మద్యం తాగారు. ఈ సమయంలో ఈ నలుగురు యువతులతో పాటు మరో నలుగురు యువకులు కూడా వున్నారు. వారంతా పుట్టిన రోజు జరుపుకుంటున్న అమ్మాయి బంధువులు.
ఇక్కడి వరకు బాగానే వున్నా.. వీరి ప్లాన్ తెలిసి ఫాలో అయ్యాడో లేక తెలియక ఫాలో అయ్యాడో కానీ ఓ స్నేహితుడు కూడా వీరిని గమనిస్తూ.. వీరంతా యువకులతో కలసి యువతులు మద్యం సేవించడాన్ని పూర్తిగా తన సెల్ ఫోన్ లో బంధించాడు. ఆ తరువాత దానిని సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. ఇంకేముంది అనుకున్నదానికంటే ఎక్కువ వేగంతో ఇది ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో విషయం తల్లిదండ్రులకు తెలిసి వారిని వాయించారు. అంతటితో అయిపోలేదు.. ఇది ఏకంగా సదరు కాలేజీ ప్రిన్సిపాల్ స్వామినాథన్ దృష్టికి వెళ్లింది.
అంతే తమ కళాశాల విద్యార్థినులు మద్యం తాగడం కళాశాల నిబంధనలకు విరుద్ధమని, మందు పార్టీ ఇంట్లో చేసుకున్నా వారు కళాశాల యూనిఫాం ధరించి ఉన్నందున, దీనివల్ల కళాశాల ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని ప్రిన్సిపాల్ స్వామినాథన్ చెప్పారు. కళాశాల అమ్మాయిలు మద్యం తాగిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కళాశాల యాజమాన్యం సదరు నలుగురిని తమ కళాశాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. తమ కళాశాల ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు మద్యం తాగిన నలుగురు అమ్మాయిలను కళాశాల నుంచి తొలగించామని భారతీదాసన్ యూనివర్శిటీ రిజిష్ట్రార్ గోపినాథ్ చెప్పారు.
ఇంతకీ వారంతా తమ కాలేజీ అమ్మాయిలేనని ప్రిన్సిపాల్ స్వామినాథన్ ఎలా గుర్తించాడని అడుగుతున్నారా.? అక్కడే వుంది అసలు కిటుకు. ఇక్కడి ఈ కాలేజీకి వున్న డ్రెస్ కోడ్ వీరిని అడ్డంగా బుక్ చేసింది. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు కాలేజ్ ఎగ్గోట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేశారు. దీంతో కాలేజీ దుస్తుల్లో వారు మద్యం సేవించడంతో తమ కాలేజీ రెఫ్యూటేషన్ పాడవుతుందని ప్రిన్సిపాల్ చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశించారని వర్శిటీ రిజిష్ట్రార్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more