దైవాంశసంభూతురాలిగా ప్రకటించుకున్న అమెలో అత్యాశ అవహించింది. తాను నిర్వహిస్తున్న ఆలయానికి మరింత పేరు రావాలని, అక్కడి పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని అమె గత ఏడాది చేసిన పని అమెను కటకటాల వెనక్కి పంపింది. అతి ఎప్పటికైనా అదోగతి పట్టిస్తుందన్న నానుడి మరోమారు నిజమైంది. తాను నిర్వహిస్తున్న ఆలయానికి భక్తులను పెద్ద సంఖ్యలో అకర్షించేందుకు అమె చేసిన ప్రయత్నమే అమెకు పేరును తీసుకువచ్చింది. దీంతో పాటు నీడలాగే వెంటాడిని దరదృష్టం కూడా ఏడాది దాటగానే.. అమెను ఊఛలు లెక్కపెట్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన వాలాజాబాద్ మండల పరిధిలోని అవెల్లేరి అమ్మ ఆలయంలో వనభద్రకాళీ అమ్మవారి దేవాలయాన్ని నిర్వహిస్తుంది కమిల అనే మహిళ. జాతకాలు చెబుతూ తన భక్తిని చూసుకుంటుంది. అయితే అమెకు ఉన్నట్టుండి ఏం అయ్యిందో తెలియదు కానీ.. తన నిర్వహణలోని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని అనుకుంది, ఇందుకోసం అమె ఓ గత ఏడాదిలో వనభద్రకాళి అమ్మవారి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించింది. ఆ సమయంలో ఓ పామును తెచ్చి, కాసేపు అమ్మవారి మెడలో ఉంచి, ఆపై తానూ అమ్మ స్వరూపాన్నేనని చెబుతూ, దాన్ని తన శరీరంపై వేసుకుని నృత్యం చేస్తూ అమ్మవారికి పాలాభిషేకం చేసింది.
(Video Source: TV9 Telugu Live)
ఈ ఘటన తరువాత ఆలయం పేరు, కపిల పేరు మారుమోగడంతో భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో పాముతో ఆమె నాట్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవి చెంగల్పట్టు జిల్లా అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వాలాజాబాద్ కు వచ్చి, విచారించారు. పామును ఎక్కడి నుంచి తెచ్చారని, ఎక్కడ పెట్టారన్న ప్రశ్నలకు కపిల నుంచి సమాధానాలు రాకపోవడంతో, వన్యప్రాణుల నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. ఆపై కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్ కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more