ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం వున్న 13 జిల్లాలతో పాటు మరో 12 ప్రాంతాలకు జిల్లాల హోదా కలుగుతుందని అన్నారు. ఈ క్రమంలో ఈ సారి రాష్ట్రంలో జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీకి 151 స్థానాలను అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 224 స్థానాల్లో గెలిపించాలని కోరారు.
దీంతో ఈ ఐదేళ్ల కాలంలో కేంద్రం రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన కూడా చేస్తోందని ఆశాభావాన్ని ఆయన మాట్లాడిన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలను పునర్విభజన బిల్లులో పొందుపర్చినట్టుగా 225 స్థానాలకు, అదే విధింగా తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలను 175 స్థానాలకు పెంచేందుకు రంగం సిద్దం అవుతుందన్న వార్తలను ఆయన వ్యాఖ్యల్లో పరోక్షంగా ఊటంకించారు. విశాఖలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో 3 రాజధానులు వస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధిని 5 నెలల్లో జగన్ చేసి చూపించారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more