తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఓ మైనర్ బాలికను బంధువలే రాబంధులై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో అన్ని తామే అయ్యి అమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బంధువులే.. అమెపై ఫైశాచిక మృగాళ్ల మాదిరిగా వ్యవహరించారు. అయితే ఇలా గత కొన్ని నెలలుగా అమెను లొబర్చుకుని పదే పదే పాడుపనికి పాల్పడటంతో అమె గర్భం దాల్చింది. దీంతో ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా స్థానికుడైన ఓ అర్ఎంపీ డాక్టరు చేత అమెకు గర్భస్రావం కూడా చేయించారు.
బాలిక కడుపునోప్పితో బాధపడటంతో అమె సోదరుడు విషయాన్ని తమ బంధువులకు చెప్పాడు. వారు బాలికను వాకాబు చేసి.. జరిగిన విషయాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులు ఆత్రం ప్రభుతతో పాటు పెందూరు శ్రీకాంత్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బాలికకు చట్టవిరుద్దంగా గర్భస్రావం చేసిన అర్ఎంపీ వైద్యుడిని కూడా అరెస్టు చేసిన కటకటాల వెనక్కి పంపారు.
కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులుగా తల్లిదండ్రులు లేని బాలిక క్షేమం కోరాల్సిన వారే.. కామంతో అఘాయిత్యానికి తెగబడిన ఈ దారుణ ఘటన కుమ్రం భీం జిల్లా జైనూరు మండలం షేక్ గూడలో జరిగింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిపై పోస్కో చట్టం కింద కేసును నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more