ప్రభుత్వ పథకాల తీరు పరిశీలిస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న నానుడి గుర్తికురాక తప్పదు. యావత్ దేశంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ.. నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛా భారత్ కార్యక్రమంలో ప్రచారం ఎంతో గొప్పగా ఉన్నా.. అపరిశుభ్రత మాత్రం తొలగిపోలేదని దేశంలోని పలు నగరాలు, పట్టాణల్లో వాతావరణం అద్దం పడుతొంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, పురపాలక సంఘాలతో కాస్తోకూస్తే ప్రగతి మాత్రం కనిపిస్తోందని మాత్రం చెప్పకతప్పదు. అయితే ఈ పథకంలో భాగంగా వెచ్చిస్తున్న నిధులు.. కనబడుతున్న శుభ్రతకు ఎంతమాత్రం సరిపోల్చలేం.
పట్టణాలు, నగరాల విషయాన్ని పక్కనబెడితే.. గ్రామీణ భారతంలో మాత్రం పరిస్థితి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వుందని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. స్వచ్ఛభారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఏకంగా 9.5 కోట్ల మరుగుదోడ్ల నిర్మాణం జరిగిందని కేంద్ర ప్రభుత్వం గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా గ్రామీణ భారతంలో ఇప్పటికీ 38శాతం ప్రభుత్వాసుపత్రులకు మరుగుదొడ్లు లేవని తాజా సర్వేలో వివరాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వున్న ఏకంగా 72వేల ప్రభుత్వాసుపత్రులలో రోగులకే కాదు కనీసం ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి కూడా టాయ్ లెట్లు లేవని ఇండియా టుడే సర్వే గణంకాలను తెలుపుతున్నాయి.
అంతేకాదు ఏకంగా 40 వేల ప్రభుత్వాసుపత్రులు కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా ఇంకా గుడ్డి దీపాల కాంతుల్లో వున్నాయని వెల్లడైంది. స్వచ్ఛా భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించే క్రమంలో ప్రధాని మోదీ గ్రామీణ భారతంలో సుమారు 60 శాతం మంది ప్రజలు బహిరంగంగానే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారని, ఇది దేశ గౌరవానికే భంగం కలింగించేలా వుందని అన్నారు. ఇక అప్పటి నుంచి స్వచ్ఛా భారత్ కార్యక్రమంలో భాగంగా 9.5 కోట్ల మరుగుదోడ్లను నిర్మంచారు. అయినా దేశంలో ఇంకా యాభై శాతం ప్రభుత్వ ప్రజారోగ్య కేంద్రాల్లో సిబ్బందికి కూడా మరుగుదొడ్లు లేవని తాజా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ సంఖ్య మరీ ముఖ్యంగా తెలంగాణలో అధికంగా వుందని వెల్లడైంది. అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తోందని.. ప్రగతిపథంలో తమకు తామే సాటి అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ఫ్రభుత్వం.. గ్రామీణ తెలంగాణలోని ప్రజారోగ్య కేంద్రాల్లో సిబ్బందికి కూడా మరుగుదొడ్లు లేని దుస్థితిలో వుందని.. కేంద్రం వెల్లడించిన గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఆతరువాతి స్థానంలో రాజస్థాన్.. ఆ తరువాత స్వయంగా ప్రధాని మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ వుంది. ముఖ్యమంత్రిగా ఏకంగా హ్యాట్రిక్ సాధించిన ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రంలోనూ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోవడం.. కొసమెరుపు.
ఇక ఆ తరువాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రతీ ప్రభుత్వ అసుపత్రిలో సిబ్బందికి మరుగుదొడ్లు వున్నాయి. అనేక అసుపత్రుల్లో సిబ్బందికి, రోగులకు వేర్వేరుగా టాయ్ లెట్స్ వున్నాయి. అయితే ఇక దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా వున్న ఉత్తర్ ప్రదేశ్ లోనూ అన్ని అసుపత్రుల్లో సిబ్బందికి మరుగుదొడ్లు వున్నాయి. కేవలం తొమ్మిది శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతంలోని అరోగ్య కేంద్రాల్లో మరుగుదొడ్ల లేవని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రాజస్తాన్ లో 85శాతం.. గుజరాత్ లో 73 శాతం గ్రామీణ సబ్ సెంట్లర్లలో మరుగుదొడ్లు లేవని సర్వే తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more