అమాత్య తనయ దిగిన ఫోటోలు, వీడియోలు తన సామాజిక మాద్యమంలో పోస్టు చేయడంతో అవి కాస్తా ఒడిషాతో పాటు యావత్ దేశవ్యాప్తంగా నెట్టింట్లో అగ్గిరాజేస్తున్నాయి. అమె దిగిన ఫోటోలు కానీ అమెతో వెళ్లిన ఇద్దరు నటీమణులు కూడా ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండానే వ్యవహరించినా.. ఎందుకని అమె ఫోటోలు అగ్గిరాజేస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా..? తాము సెలబ్రిటీలమని ఇద్దరు నటీమణులతో పాటు తాను అమాత్యుని కూతుర్నినని మంత్రి తనయ ఏకంగా హద్దులు దాటి నిషిధ్ద ప్రాంతంలో ఫోటోలు దిగారు.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలు అందరికీ వర్తిస్తాయన్న విషయం తెలిసినా.. తాను మంత్రి కూతుర్ని తనకు రూల్స్, గీల్స్ వర్తించవని భావించినట్లుందీ ఒడిషా ఆరోగ్యశాఖ మంత్రి నభా కిషోర్ దాస్.. తనయ దీపాలి దాస్.. తన స్నేహితురాళ్లైన నటీమణులు పకృతి మిశ్రా, ఎలినా సమంత్రేలతో కలసి ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంబాల్ పూర్ వెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో మహానందీ నదిపై నిర్మితమైన హిరాకూడ్ డ్యామ్ ను సందర్శించారు. తమతో పాటు అమె తన వెంట ఒక ఫ్యాషన్ డిజైనర్ లొవినా నాయక్ ను కూడా తీసుకుని వెళ్లింది.
ఇంతవరకు బాగానే వున్నా డ్యామ్ పై నిషిద్ద ప్రాంతానికి వీరు వెళ్లడం.. అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకుంది. అయినా ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కోని అమె.. అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే అవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. వైరల్ కావడానికి కారణం అవి నిషిద్ద ప్రాంతంలో దిగినవి కావడమే. అంతే పనిలో పనిగా ఒక్కసారిగా విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మంత్రి కూతురైనంత మాత్రన అమె నిషిద్ద ప్రాంతంలోకి ఎలా వెళ్లి ఫోటోలు దిగగలుగుతుందని.. అక్కడి అధికారులు ఏం చేస్తున్నారని నెటిజనులు ప్రశ్నించారు.
ఇలా ఒకటి రెండు కాదు.. అనేక విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి కుమార్తెకు అక్కడి సీఐఎస్ఎఫ్ అధికారులు నిషిద్ద ప్రాంతానికి ఎలా వెళ్లనిచ్చారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో స్పందించిన పోలీసులు ఒడిశా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ను దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వివాదంపై మంత్రి నబ కిశోర్ దాస్ స్పందించారు. తన కుమార్తె మైనర్ కాదని, ఆమె తరఫున మాట్లాడబోనని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అటు హీరోయిన్లు ప్రకృతి, ఎలినా కూడా స్పందిస్తూ.. ఇలాంటి పొరబాట్లు మరోసారి చేయబోమన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more