మెట్రో రైలు ప్రయాణికులకు హెచ్ఎంఆర్ఎల్ సంస్థ తీపి కబరును అందించింది. ఇకపై ప్రతి రోజు ఈ రైళ్లలో ప్రయాణించేవారికి ఇది గుడ్ న్యూస్. మెట్రో రైలు ప్రయాణికులకు జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలను హైదరాబాద్ మెట్రో రైల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక దీంతో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. ఆందుకోసం లోకల్ వైఫై నెట్ వర్క్ సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతొ ప్రయాణికులు మొబైల్ డేటాను వినియోగించకుండానే వీడియోలు చూసే అవకాశం కల్పించింది.
మెట్రోలో షుగర్ బాక్స్ నెట్ వర్క్ ను మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. షుగర్ బాక్స్ నెట్ వర్క్ తో ఇంటర్నెట్ లేకుండానే వీడియోలు చూసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. తొలుత 10 మెట్రోస్టేషన్లలో షుగర్ బాక్స్ మెట్రో లోకల్ వై-ఫై సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. మెట్రో రైళ్లలో వినోదం, మేధోసంపత్తిని పెంచే పుస్తకాలు ఉంచాలని కోరామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.
కాగా జీ5 సేవలను 60 రోజుల వరకు ఉచితంగా అందిస్తామని షుగర్ బాక్స్ సీఈవో రోహిత్ తెలిపారు. తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ప్రతి రోజు మెట్రోలో ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగమన్నారు. గేమింగ్, ఫుడ్, ఈ-కామర్స్, ఈ-లెర్నింగ్ లాంటివి కూడా అందుబాటులోకి తెస్తామని రోహిత్ వివరించారు. మెట్రో స్టేషన్లలో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. రెండో దశ మెట్రో డీపీఆర్ సిద్ధమైందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more