మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో.. ఇటీవల తాను ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఆయన నివాసంలోనే భేటీ కావడంపై.. తమ పార్టీ సరికొత్త రాజకీయ సమీకరణలకు ఆజ్యం పోస్తుందని వచ్చని వార్తలపై ఇప్పుడు ఎన్సీపి అధినేత శరద్ పవార్ పెదవి విప్పారు. ఇక తనకు రాష్ట్రపతి పదవిని కూడా బీజేపి ఆఫర్ చేసిందన్న వార్తలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో బీజేపితో కలసి ఎన్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వచ్చిన ఊహాగాలపై కూడా ఆయన స్పష్టం ఇచ్చారు.
నాటి సమావేశంపై శరద్ పవార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు న్యూఢిల్లీకి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం వాస్తవమే. అయితే తమ ఇద్దరి భేటీలో ఇద్దరం కలిసి పని చేద్దామన్న ప్రతిపాదన ప్రధాని మోదీ వైపు నుంచి వచ్చిందని చెప్పారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని పవార్ అన్నారు. "మనిద్దరి మధ్యా వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి. కానీ, కలిసి పనిచేయడం జరిగే పని కాదు" అని స్పష్టం చేసినట్టు పవార్ తెలిపారు. ఇక ఈ విషయంలో బీజేపికి తాను మద్దతు తెలిపితే.. తనకు రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్తలు మాత్రం అవాస్తవమని అన్నారు.
కాగా, తన కుమార్తె సుప్రియా సూలేను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే విషయం మాత్రం చర్చకు వచ్చిందన్నారు. ఎన్సీపీ మహారాష్ట్రలో బీజేపికి మద్దతు ఇస్తే.. శివసేన కు లభించిన కేంద్రమంత్రి పదవి ఖాళీ అవుతుందని, దానిని కూడా ఎన్సీపికి ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధాని చెప్పారని శరద్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో శరద్ పవార్ పై మోదీ ప్రశంసల వర్షం కురిపించడం, ఆ వెంటనే పవార్ హస్తినకు వెళ్లి చర్చలు జరపడంతో కొత్త పొత్తులు ఏర్పడనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అయితే, చివరకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికలో ప్రభుత్వం ఏర్పడింది.
(And get your daily news straight to your inbox)
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more
Jan 12 | కరోనా మహమ్మారి విజృంభనతో గత మార్చి నుంచి నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు ఉన్న ఉద్యోగాలే గాలిలో దీపాలుగా మారుతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికినా ఫర్యాలేదని నిరుద్యోగ యువత భావిస్తున్నారు. కరోనా... Read more
Jan 12 | కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా,... Read more
Jan 12 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రిట్... Read more