బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఆర్టీసీ బస్సు బీభత్సం చేసింది. తాత్కాలిక డ్రైవర్ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. మహిళ తల పైనుంచి బస్సు చక్రం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ప్రమాదంలో ఆమె తల నుజ్జనుజ్జయింది. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతి చెందిన యువతిని టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనా (26)గా గుర్తించారు. సోహిని మంగళవారం (నవంబర్ 26) మధ్యాహ్నం తన ద్విచక్రవాహనంపై మాసబ్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ను స్థానికులు, వాహనదారులు పట్టుకొని దాడి చేశారు. దుస్తులు చించిమరీ చితకబాదారు. ఆగ్రహంతో ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. మృతదేహం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రమాదంతో మాసాబ్ ట్యాంక్ - పంజాగుట్ట, మెహిదీపట్నం మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే స్పాట్లో మూడేళ్లలో ఐదు సార్లు ఇదే తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని తాత్కాలిక డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అతడు బర్కత్పుర డిపోలో గత నెల రోజులుగా తాత్కాలిక డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న అనేక మంది వచ్చి ఏం జరిగిందోనంటూ అందోళనలో వుండగా.. ఒక యువకుడు మాత్రం తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ఘటనాస్థలంలో తన చర్యలతో నెట్ జనులతో చివాట్లు తింటున్నాడు. సెల్ఫీలకు పరాకాష్టగా నిలిచాడు. మహిళా రోడ్డుపై విగతజీవిలా పడివుండగా, ఆమె తల కనబడకూడదని స్థానికులు ఓ కవర్ ను వేసినా.. ఎలాంటి అదురు, బెదురు లేకుండా.. కనీసం మానవత్వం లేకుండా అక్కడే నిలబడి యువకుడు ఫోటో తీయడం కెమెరాకు చిక్కింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more