పవిత్ర పుణ్యక్షేత్రం శబరిగిరీశుడు అయ్యప్ప స్వామి కొలువైవున్న శబరికొండకు వెళ్లే భక్తులకు ఓ కీలక సమాచారాన్ని అందించింది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు. ఆయ్యప్ప స్వామి మండలపూజ నిర్వహించే డిసెంబర్ మాసంలో ఆలయం తెరుచుకోనున్నా.. సూర్యగ్రహణం కారణంగా నాలుగున్నర గంటల పాట ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. సరిగ్గా మండల పూజ మండల కలామ్ నిర్వహించేందుకు ఒక రోజు ముందున ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు.
డిసెంబర్ 26న సంక్రమించనున్న సూర్యగ్రహణం కారణంగా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నట్టు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రకటించింది. ఆ రోజు ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 11:30 వరకు నాలుగు గంటలపాటు ఆలయాన్ని మూసివేయనున్నట్టు పేర్కొంది. 26న ఉదయం 8:06 గంటలకు ప్రారంభయ్యే సూర్యగ్రహణం ఉదయం 11:13 గంటలకు ముగుస్తుంది. ఆలయంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించి.. పున్యాహవచనం చేసిన తరువాత కానీ.. స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించరు.
శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు మాలికాపురం, పంబలో ఉన్న సాక్షి గణపతి సహా మిగిలిన ఆలయాలను కూడా 26న మూసివేయనున్నట్టు ట్రావెన్ కోర్ దేవాలయ ఈవో తెలిపారు. కాగా, వచ్చే నెల 27న నిర్వహించనున్న మండల పూజల సందర్భంగా ఈ నెల 17న ఆలయాన్ని తెరిచారు. రికార్డు స్థాయిలో భక్తులు సందర్శించుకుంటున్నారు. ఇక మండల పూజకు కూడా కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హజారై స్వామివారిని సందర్శించుకుంటారు. అయితే సరిగ్గా ఒక్క రోజు ముందే ఆలయాన్ని మూసివేయునుండటం వల్ల రద్దీ ఏర్పడే అవకాశాలు వున్నాయి. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more