నూతనంగా ప్రారంభించిన గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ పార్కు వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ప్రమాదాలకు నెలవుగా మారిందా.? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రారంభమైన ఈ ప్లైఓవర్ ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితనాన్ని ప్రశ్నిస్తోంది. ఇవాళ జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9మంది గాయపడ్డారు. గ్లాల్లో తేలినట్టుందే.. అన్న పాటలు పక్కన బెడితే ఈ ప్లైఓవర్ పై ప్రయాణిస్తే.. తప్పకుండా వాహనాలతో పాటు గాల్లో తేలి కింద పడాల్సి వస్తుందని ప్రయాణికులు వ్యంగంగా వ్యాఖ్యానించే దుస్థితి వచ్చింది.
ఇవాళ ఈ ప్లైఓవర్ పై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం మధ్యాహ్నం ఫ్లైఓవర్ మీదుగా ఓ కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి పల్టీ కొట్టింది. వంతెన పైనుంచి కింద రహదారిపై ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళపై పడింది. దీంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని సమాచారం. కాగా అధిక వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో కారు తునా తునకలు అవ్వగా, చెట్లు విరిగి పడ్డాయి. మరోవైపు ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే గత వారం ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ పోలిస్ కమీషనర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ అదేశాల నేపథ్యంలో ప్లైఓవర్ ను మూడు రోజుల పాటు మూసివేసి.. వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు.
#Hyderabad#Shocking #CCTVFootage
— T Raghavan (@NewsRaghav) November 23, 2019
A Woman killed, 6 injured after speedy car falls from newly constructed flyover in Hyderabad.@indiatvnews @IndiaTVHindi pic.twitter.com/7DI12hqZMe
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more