అసంఘటిత భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ వారిని రోడ్డున పడేస్తుందంటూ విశాఖ లాంగ్ మార్చ్ లో విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ తరువాత కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భవన నిర్మాణరంగాన్ని నమ్ముకుని బతుకుతున్న లక్షలాదిమంది కార్మికులు, కూలీలు జీవితాలతో ఈ సమస్య ముడిపడిందని అవేదన వ్యక్తం చేసిన ఆయన తాజాగా ఇదే సమస్యపై వైసీపీ నేతలను రుద్రవీణ పాటలైనా మేలుకోల్పాలని అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ఆయన తాజాగా చేసిన ట్వీట్ లో పేర్కోన్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ విజయవంతమైన తర్వాత, ఫుల్జోష్లో కనిపిస్తున్నట్టున్న జనసేనాని.. గెలుపోటములు కేవలం పాసింగ్ క్లౌడ్స్ అని.. తన, తన పార్టీ సిద్ధాంతాలు అమలు జరిగినప్పుడే నిజమైన విజయమని అభిప్రాయపడే పవన్ కల్యాణ్ తాజాగా.. ట్విట్టర్లో వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవికాస్తా వ్యంగ్యాస్త్రాలుగా సంధించారు. వైసీపీ నేతలకు, రుద్రవీణ పాటలైనా మేల్కొల్పాలంటూ, పవన్ చేసిన ట్వీట్, సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
ఇంతకీ ట్విట్టర్లో పవన్ రుద్రవీణ ట్వీట్ ఏంటంటే, 'రుద్రవీణ... నాకు స్ఫూర్తిని ఇచ్చే చిత్రం. భవన నిర్మాణ కార్మికులు రోజువారీ కూలి దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా జీతభత్యాలు తీసుకొంటున్న వైసీపీ నేతలకు రుద్రవీణలోని పాటలు మేలుకొలుపు'' అని అన్నారు పవన్. దీనికి 'చుట్టూ పక్కల చూడరా...' అన్న పాటను యాడ్ చేశారు జనసేనాని. మరో ట్వీట్లో... ''వైసీపీ మ్యానిఫెస్టోకు, వారి వాగ్దానాలకు ఓటేసిన ప్రజల కళ్లు తెరిపించే పాట మరోటి ఉంది. వాస్తవంగా హామీల అమలు పరిస్థితిని అది అద్దంపడుతుంది'' అన్నారు పవన్. దానికి 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ...' అన్న సాంగ్ను యాడ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more