సీనియర్ నాయకుడు, అనంతపురం జిల్లా టీడీపీ ప్రతినిధి జె.సి.దివాకర్రెడ్డి జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని వైఎస్సార్ ప్రభుత్వం తమ ప్రత్యర్థులను ఎంచుకుని మరీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. అన్ని వైపుల నుంచి అష్టదిగ్భంధనం చేసి బలమైన ప్రత్యర్థులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఒత్తిడి తీసుకువస్తుందని మండిపడ్డారు. మనుషులను, సంస్థలను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు. ఒత్తిడులను పెంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేయడమే ఈ కేసుల ప్రధాన ఉద్దేశమని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభమైన ఈ ఒత్తిళ్లు భవిష్యత్తులో మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. జేసీ ట్రావెల్స్కు చెందిన బస్సులు సీజ్ చేయడం కూడా ఇందులో భాగమేనన్నారు. నిర్ధేశిత సమయంలో కన్నా ఆలస్యంగా నడుస్తున్నాయని బస్సులను సీజ్ చేస్తారా.? కానీ ఇక్కడ జరుగుతుందందేనన్న జేసీ.. వ్యాపారంపై దెబ్బకోట్టి.. ఆదాయ వనరులు లేకుండా చేయడం వెనుక పరమార్థం ఒక్కటేనన్నారు. ఎంచుకున్నవారిని కేసుల పేరుతో అందోళనకు గురిచేసి తమ పార్టీలో కలుపుకునేందుకనే అరోపించారు.
తాము దశాబ్దాలుగా రవాణా వ్యాపారంలో తాను ఉన్నానని, నిబంధనలు అతిక్రమించిన సందర్భాలు ఎప్పుడూ లేవని అన్నారు. అయినా మా బస్సులు సీజ్ చేస్తున్నారంటే లక్ష్యం మేరకేనన్నారు. లేదంటే మిగిలిన సంస్థల బస్సులు ఎన్ని సీజ్ చేశారని చెప్పారు. ట్రిబ్యునల్ బస్సులను విడుదల చేయాలని చెప్పినా రవాణా శాఖ అధికారులు వదలడం లేదన్నారు. సీఎస్ లాంటి ఉన్నత స్థాయి అధికారిపైనే వేటు వేసిన ప్రభుత్వం తమనేం చేస్తుందో అన్న భయం వల్లే అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more