మీకు ఆధార్ సేవలు అవసరమైతే దగ్గర్లోని ఆధార్ సెంటర్ కు వెళ్తుంటారు కదా? స్థానికంగా సేవలు అందించే ఆధార్ సెంటర్లతో పాటు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఉడాయ్ (UIDAI) దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేకంగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే విజయవాడలో ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటైంది. ఇక దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆధార్ సేవ కేంద్రాల ఏర్పాటు కొనసాగుతోంది. అందులో భాగంగా హైదరాబాద్ వాసుల కోసం తొలి ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించింది. హైదరాబాద్లోనే తొలి ఆధార్ సేవా కేంద్రాన్ని మాదాపూర్లో ఏర్పాటు చేసింది ఉడాయ్ (UIDAI).
ఇప్పటికే హైదరాబాద్లో స్థానికంగా ఉండే ఆధార్ సెంటర్లతో పాటు 236 బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, బీఎస్ఎన్ఎల్ కేంద్రాల్లో పౌరులకు ఆధార్ సేవలు లభిస్తున్నాయి. వీటితో పాటు మాదాపూర్లోని ఆధార్ సేవా కేంద్రం పౌరులకు అందుబాటులోకి వచ్చింది. మాదాపూర్లోని విఠల్ రావు నగర్లో రిలయెన్స్ సైబర్ విల్లాలో ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించింది UIDAI. వారంలో 7 రోజులు ఈ ఆధార్ సేవా కేంద్రం పనిచేస్తుంది. రోజుకు 1000 మందికి సేవలు పొందొచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆధార్ సేవా కేంద్రం పనిచేస్తుంది.
అనునిత్యం హైదరాబాదీయులకు అందుబాటులో వుంటూ సేవలందించేందుకు సిద్దంగా వున్న ఈ ఆధార్ సేవా కేంద్రం వారంలో ఏడు రోజులు పనివేళల్లో నగరవాసులకు అందుబాటులో వుంటుంది. ఎన్రోల్మెంట్ ఫీజు రూ.50. ఈ ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్ సేవలు పొందాలనుకునేవారు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. https://ask.uidai.gov.in/ వెబ్సైట్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
Hyderabad has a new #AadhaarSevaKendra (capacity: 1000 requests/day) in Vittal Rao Nagar, Madhapur.
— Aadhaar (@UIDAI) October 30, 2019
Open all 7 days.
Services also available in 236 banks, post offices, state government offices and BSNL centres in Hyderabad area.
Book Appointment: https://t.co/Pslu86F0ZN pic.twitter.com/in0J1sWph7
ఇక ఇదే తరుణంలో హైదరాబాదు పోస్టల్ శాఖ కూడా నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ఆదార్ సేవలను ఇంటివద్దనే అందించే విధంగా ఫైలట్ ప్రాజక్టును చేపట్టింది. అయితే ఒకరిద్దరు ఇంటిదగ్గర ఆధార్ సేవలు పొందాలనుకుంటే కుదరదు. కనీసం 30 మంది ఉంటి వారికి ఇంటి దగ్గర ఆధార్ సేవలు అందుతాయి. ప్రజలకు ఆధార్ సేవల్ని మరింత దగ్గర చేయాలన్న ఉద్దేశంతో పోస్టల్ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అపార్ట్మెంట్వాసులు, కాలనీవాసులు కలిసి ఒకేసారి ఆధార్ సేవలు పొందేందుకు అద్భుతమైన అవకాశమిది. మరి మీ కాలనీలో లేదా అపార్ట్మెంట్లో కనీసం 30 మంది ఆధార్ సేవలు పొందాలనుకుంటే 9440644035 నెంబర్కు కాల్ చేయాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more