Telangana High Court Upset With RTC Affidavit ఆర్టీసీ కేసు విచారణ నవంబర్ 7కు వాయిదా

Tsrtc strike high court expresses unhappy over affidavit filed by rtc in charge md

TSRTC Workers, High Court, RTC MD Sunil sharma, RTC MD Sunil sharma Affidavit, RTC MD affidavit, High court urges workers to call off strike, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Telangana High court has expressed unhappiness over the affidavit filed by TSRTC in-charge MD Sunil Sharma over the financial position of the RTC. During the hearing RTC in-charge MD has submitted an affidavit, which states that the government has released the subsidy amount of Rs 644 crore to RTC.

టీఎస్ఆర్టీసీ సమ్మె: ఇది అఫిడెవిటేనా.? హైకోర్టు అసంతృప్తి.. నవంబర్ 7కి వాయిదా

Posted: 11/01/2019 03:51 PM IST
Tsrtc strike high court expresses unhappy over affidavit filed by rtc in charge md

తెలంగాణ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ మీద హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన విచారణలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్టీసీ స్థితిగతులపై ఇన్‌‌చార్జి ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.644 కోట్ల రాయితీని రిలీజ్ చేశామని అందులో పేర్కొన్నారు. అయితే, ఇవేం లెక్కలు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇది అఫిడెవిటేనా అని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో మళ్లీ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.

బస్సుల కొనుగోలుకైన వ్యయాన్ని బకాయిలుగా చెపుతారా అని ప్రశ్నిస్తూ.. అసలు జీహెచ్ఎంసీ, ఆర్టీసీకి బకాయిలు చెల్లించారా.. లేదా అన్న విషయం స్పష్టం చేయాలని కోరింది. గతంలో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవచ్చు, ప్రస్తుతం దాని పరిస్థితి బాగానే ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2015 నుంచి 2017కు మధ్య కాలంలో జీహెచ్ఎంసీ ఆర్టీసీకి భారీ మొత్తంలో బకాయిలున్నప్పటికి కేవలం రూ.336 కోట్లు మాత్రమే చెల్లించిందని ఆర్టీసీ తన నివేదికలో తెలిపింది. నిబంధన 112(30) సెక్షన్ ప్రకారం నగరంలో బస్సులో నడిపినందుకు వచ్చే నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్ఎంసీ అంగీకరించలేదని ఆర్టీసీ అఫిడవిట్లో పేర్కొంది.

గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన రాయితీల సొమ్ము రూ.644.51 కోట్లు కాగా ఆ మొత్తంను చెల్లించినట్లు పేర్కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ నగరంలో బస్సులు నడుపుతున్నందుకు రూ.1786.06 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిధులను బకాయిలుగా పరిగణించరాదని ఆర్టీసీ కోర్టును అభ్యర్థించింది.  నిర్వహణ, డీజిల్ వ్యయం కారణంగా సంస్థ నష్టాలు ఎదుర్కొంటుందని అఫిడవిట్లో పేర్కొంది. కార్మికుల సమ్మె ప్రారంభమైన అక్టోబర్ 5 నుంచి 30వ తేదీ వరకు బస్సుల ద్వారా రూ.78 కోట్లు ఆర్జించగా, మరోవైపు రూ.160 కోట్లు నిర్వహణ వ్యయం నమోదైందని తెలిపింది. కాగా, హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  High Court  RTC MD Sunil sharma  Affidavit  Ashwathama Reddy  RTC Employees  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles