తెలంగాణ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ మీద హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన విచారణలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్టీసీ స్థితిగతులపై ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.644 కోట్ల రాయితీని రిలీజ్ చేశామని అందులో పేర్కొన్నారు. అయితే, ఇవేం లెక్కలు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇది అఫిడెవిటేనా అని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో మళ్లీ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
బస్సుల కొనుగోలుకైన వ్యయాన్ని బకాయిలుగా చెపుతారా అని ప్రశ్నిస్తూ.. అసలు జీహెచ్ఎంసీ, ఆర్టీసీకి బకాయిలు చెల్లించారా.. లేదా అన్న విషయం స్పష్టం చేయాలని కోరింది. గతంలో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవచ్చు, ప్రస్తుతం దాని పరిస్థితి బాగానే ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2015 నుంచి 2017కు మధ్య కాలంలో జీహెచ్ఎంసీ ఆర్టీసీకి భారీ మొత్తంలో బకాయిలున్నప్పటికి కేవలం రూ.336 కోట్లు మాత్రమే చెల్లించిందని ఆర్టీసీ తన నివేదికలో తెలిపింది. నిబంధన 112(30) సెక్షన్ ప్రకారం నగరంలో బస్సులో నడిపినందుకు వచ్చే నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్ఎంసీ అంగీకరించలేదని ఆర్టీసీ అఫిడవిట్లో పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన రాయితీల సొమ్ము రూ.644.51 కోట్లు కాగా ఆ మొత్తంను చెల్లించినట్లు పేర్కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ నగరంలో బస్సులు నడుపుతున్నందుకు రూ.1786.06 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిధులను బకాయిలుగా పరిగణించరాదని ఆర్టీసీ కోర్టును అభ్యర్థించింది. నిర్వహణ, డీజిల్ వ్యయం కారణంగా సంస్థ నష్టాలు ఎదుర్కొంటుందని అఫిడవిట్లో పేర్కొంది. కార్మికుల సమ్మె ప్రారంభమైన అక్టోబర్ 5 నుంచి 30వ తేదీ వరకు బస్సుల ద్వారా రూ.78 కోట్లు ఆర్జించగా, మరోవైపు రూ.160 కోట్లు నిర్వహణ వ్యయం నమోదైందని తెలిపింది. కాగా, హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more