మహారాష్ట్రలో మిత్రపక్ష కూటమి బీజేపి-శివసేన పార్టీల మధ్య సయోధ్య కుదిరి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ వ్యాఖ్యానించారు. అయితే బీజేపి శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికైనంత మాత్రనా.. వారే ముఖ్యమంత్రి అవుతారని ఎవరు చెప్పగలరని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ తాజాగా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న అంశంపై అసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, బీజేపి మధ్య ప్రస్తుతం చర్చలు జరగడం లేదని తేల్చిచెప్పిన ఆయన.. శివసేనకు చెందిన నాయకుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని రెండున్నరేళ్ల కాలం పాటు ఒకరు.. మరో రెండున్నరేళ్ల కాలం పాటు మరోకరు పంచుకోవాలంటూ తాము పెట్టిన డిమాండ్ ను బీజేపి అంగీకరించని పక్షంలో తమ పార్టీకి చెందిన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని ఆయన తేల్చిచెప్పారు. వర్లీ నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్దవ్ థాక్రే కుమారుడు అదిత్య థాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని పార్టీ కోరుతతోంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'బీజేపీకి మేము ఎటువంటి అల్టిమేటమూ జారీ చేయాలని అనుకోవట్లేదు. ఆ పార్టీ వారు గొప్ప నేతలు. ఒకవేళ శివసేన ఇతర పార్టీలతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే స్థిరమైన సర్కారు ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. కానీ, రాష్ట్రంలో 50-50 ఫార్ములా ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్పునిచ్చారు. అలాగే, వారు శివసేన నేతే సీఎం కావాలని కోరుకుంటున్నారు. మేము రైతుల కష్టాలను వివరించి చెప్పేందుకే గవర్నర్ ను కలుస్తున్నాం. ఇందులో మరే ఉద్దేశం లేదు' అని వ్యాఖ్యానించారు.
అయితే అధికార పంపకం ఫార్ములకు అంగీకరించని బీజేపి.. మధ్యే మార్గాన్ని అవలంభించింది. మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి సహా, 14 మంత్రి పదవులను ఇవ్వాలని బీజేపీ నిర్ణయించగా అందుకు శివసేన ససేమిరా అంటోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపి మరోమారు క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని నిర్ణయాలను వెలువరించాలని సూచించింది. కూటమిగా ప్రజల ముందుకు వెళ్లిన తమను మహారాష్ట్రవాసులు అమోదం తెలిపినందున ఇద్దరం కలిసే అధికారాన్ని అనుభవించాలని అందుకు అధికార మార్పిడి ఒక్కటే మార్గమని శివసేన తేల్చిచెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more