మెగాస్టార్ చిరంజీవి చిత్రం రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా వున్న ఈ నేత తాజాగా మళ్లీ రాజకీయ నేతలతో సమవేశం అవుతున్నారు. తన రాజకీయ జీవితం ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో.. ఆయన తన సహనటులైన రజనీకాంత్, కమల్ హాసన్ లకు కూడా రాజకీయాలకు దూరంగా వుండాలని సూచించారు. రాజకీయాల్లో అనుకున్నంత ప్రజాసేవ చేయలేమని, అంతకంటే సినీజీవితంతో పాటు సాధ్యమైనంత ప్రజాసేవ చేయడమే మేలని కూడా పేర్కోన్న విషయం తెలిసిందే.
అలాంటి చిరంజీవి తాజాగా రాజకీయ నేతలతో సమావేశం అవుతూ బిజీగా మారుతున్నారు. క్రితం రోజున తన కుటుంబసభ్యులతో తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న చిరంజీవి.. సీఎం జగన్ తో సమావేశమైన ఆయన తాజాగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కూడా కలవనున్నారు. అయితే ఈ భేటీ ఎప్పుడు వుండే అవకాశం వుందన్న విషయాలు ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ లభ్యతను బట్టి తెలుస్తుందని సమాచారం.
అయితే బుధవారం రోజు చిరంజీవి సతీసమేతంగా ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. హస్తిన వెళ్లున్న ఈ మాజీ కేంద్రమంత్రి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. దేశ స్వతంత్ర సంగ్రామ తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాను చూడమని చిరంజీవి వెంకయ్య నాయుడుని అడిగే అవకాశం ఉంది.
అనంతరం ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం కూడా చిరంజీవి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. ఆయన అపాయింట్ మెంట్ కూడా దొరికితే మోడీని కూడా కలసే అవకాశం ఉంది. అయితే మోడీతోపాటు గంటా శ్రీనివాస్ కూడా మోడీని కలిసే అవకాశం ఉందని తెలుస్తుండగా.. వీరి భేటికి రాజకీయ ప్రాధన్యత ఉందా? అనే విషయమై ఆసక్తికర చర్చ నడుస్తుంది. అయితే రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా కేవలం నటుడిగానే చిరంజీవి ప్రధానితో భేటీ అవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఆకట్టుకోగా, ఆయన నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మళయాల భాషల్లో సినిమా విడుదలైన ఈ చిత్రానికి తెలుగువారిన నుంచి వచ్చిన స్పందన.. మిగతా బాషల్లో అశించిన మేర రావడం లేదు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more