అఖిలాండకోటి బ్రహ్మోడనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిన్న సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణను నిర్వహించారు అర్చకదేవుళ్లు. ఆలయ మాడవీధుల్లో స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుడి ఊరేగింపు జరగగా ఆలయ నైరుతి మూలలో భూమిపూజ నిర్వహించారు. అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో శ్రీవారి బ్రహోత్సవాల అంగరంగ వైభవ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'తో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ నిర్వహించిన అర్చకలు, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేశారు. ఇక ఇవాళ సాయంత్రం గం.5-23 నిమిషాల నుంచి 6 గంటల మధ్య మీన లగ్న సుమూహూర్తంలో ధ్వజారోహణ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంతో బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవ వేడుకలకు సకల దేవతామూర్తులనూ ఆహ్వానిస్తారు.
శ్రీవారి వాహనం గరుడుడు కాబట్టి, కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరించి.. దానిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. దీనిని 'గరుడ ధ్వజ పటం' అంటారు. గరుడ ధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీనలగ్నంలో కొడితాడుకు కట్టి, పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే "న భూతో న భవిష్యతి" అనేలా జరిగే అనంతకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు అహ్వానపత్రం.
ఈ వేడుకులకు సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఆహ్వానిస్తారు. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే. ఈ ఆహ్వానంతో ముక్కోటి దేవతలూ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉండి, ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి అరుదైన వేడుక ఇవాళ సాయంత్రం నిర్వహిస్తారు.
వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం జరిగే ధ్వజారోహణ జరగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి పట్టువస్త్రాలు సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహనంపై ఊరేగనున్న మలయప్పస్వామి సేవలో సీఎం పాల్గొంటారు. ఈ క్రమంలోనే రాత్రికి తిరుమలలోనే జగన్ బస చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more