అక్రమ మైనింగ్, టీడీపీ హయాంలో చేసిన అక్రమాల నుంచి బయటపడేందుకే జేసీ దివాకర్ జగన్ భజన చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం జేసీకి వెన్నెతో పెట్టిన విద్యని.. ఇలా డబుల్ స్టాండర్డ్స్ ను పాటించే జేసిని అందరూ ఓ జోకర్ గా, కమెడియన్ గా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. జేసీకి తన ఇంటి వాచ్మెన్ ఉద్యోగం కూడా సీఎం జగన్ ఇవ్వరంటూ సెటైర్లు పేల్చారు.
దివాకర్రెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నారని.. ఆయన్ను ప్రజలు కూడా చీదరించుకుంటున్నారన్నారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డితో పాటు ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిలకు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా పద్ధతిని మార్చుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు హయాంలో బంట్రోతు ఉద్యోగం చేసిన దివాకర్రెడ్డి.. ఇప్పడు బీజేపీని మోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
టీడీపీలో ఉన్న జేసీ.. కడప ఎయిర్ పోర్టులో కన్నా లక్ష్మీనారాయణను ఎందుకు కలిశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య సుమారుగా అరగంటపాటు చర్చలు జరిగాయని.. ఆ చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయో జేడీ మీడియాకు చెప్పగలరా అని పెద్దిరెడ్డి నిలదీశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో నీటి సమస్యకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కారణమని ఆరోపించారు పెద్దారెడ్డి.
కాంట్రాక్టర్ ను మరమ్మతుల పనులు చేయనివ్వకుండా జేసి బెదిరించారని పెద్దిరెడ్డి అరోపించారు. ఇక తన హయాంలో తన నియోజకవర్గంలో తాగునీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎంపీగా వున్న ఆయన కనీసం స్పందించలేదన్నారు. తాము మరమ్మతులు చేసి తాగునీటి సరఫరాను మొదలుపెట్టామన్నారు. తాడిపత్రిలో వ్యాపారులతో కిలో చికెన్కు రూ. 20 పర్సేంటేజీ వసూలు చేశారని.. తాను చేసిన అరోపణలపై జేసీ బ్రదర్స్తో బహిరంగా చర్చకు కూడా సిద్ధమని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more