ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు, ఓటర్ ఐడీలు, పాన్కార్డుల అనుసంధానానికి మాత్రమే పరిమితమైన ఆధార్ సంఖ్యను ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలకు అనుసంధానించేందుకు రంగం సిద్ధమైంది. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ వివరాలను అనుసంధానించడానికి సంబంధించి చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నదీ, లేనిదీ ఈ నెల 24లోగా తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ విషయంలో కేంద్రం ఇచ్చిన సమాధానం తర్వాతే ఫేస్బుక్ బదిలీ పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
జస్టిస్ దీపక్ మిశ్రా గుప్తా, అనిరుద్ధ బోస్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఫేస్బుక్ ఇంక్ వేసిన పిటిషన్ను విచారించింది. వ్యక్తిగత ప్రొఫైల్స్కు ఆధార్ను అనుసంధానించడంపై దాఖలై వివిధ హైకోర్టుల వద్ద పెండింగులో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఫేస్బుక్ ఇంక్ బదిలీ పిటిషన్ దాఖలు చేసింది. గుర్తింపు ప్రామాణికత కోసం సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ను అనుసంధానించాలని కోరుతూ గతేడాది జూలైలో మద్రాస్ హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.
పేస్బుక్ బదిలీ పిటిషన్పై సుప్రీం ధర్మాసనం మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో తాము నిర్ణయం తీసుకోవాలా? లేక, హైకోర్టులకు వదిలేయాలా.? అనేది ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. అయితే, త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కేంద్రం తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. వివిధ హైకోర్టులలో పెండింగులో ఉన్న పిటిషన్లను అత్యున్నత ధర్మాసనానికి బదిలీ చేయడానికి తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ వివరాలను అనుసంధానించడమంటే యూజర్ల స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని ఫేస్బుక్ పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more